కొటికిపెంటలో త్రాగునీటి సమస్యకు చెక్

సర్పంచ్ ఇజ్జాడకు పలువురు కృతజ్ఞతలు

Mana News :- పాచిపెంట, నవంబర్ 21( మన న్యూస్ ):- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కొటికి పెంట గ్రామంలో త్రాగునీటి సమస్యను సర్పంచ్ అప్పలనాయుడు తో కలిసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పరిష్కరించారు. గత కొన్నేళ్లుగా ఆ గ్రామానికి త్రాగునీటి సమస్య నెలకొంది.సుమారు 280 కుటుంబాలు వెయ్యి మందికి పైగా జనాభా ఉన్న గ్రామానికి తరచూ తాగు నీటి సమస్య సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడుకు తలనొప్పిగా మారింది. మండల సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు అధికారులు దృష్టికి తీసుకెళ్లేవారు. ప్రభుత్వ అధికారులు సహకారంతో పంచాయతీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 3000 లీటర్లు కెపాసిటీ కలిగిన మంచి నీటి పథకాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఇంకా సమస్య కళ్ళ ఎదుట కనబడుతుండటంతో ప్రతీ వీధిలో కుళాయిలు మాదిరిగా మంచినీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో గత కొద్ది కాలంగా సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సిబ్బంది తో కలిసి వీధి వీధికి మంచినీటి పథకాలు నిర్మించారు. అనంతరం వీధి వీధికి రెండేసి పైపు లైన్లు కుళాయిలు మాదిరిగా ఏర్పాటు చేసి త్రాగు నీరు అందించారు. కొటికి పెంట పంచాయితీలో గల 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రెండు లక్షల రూపాయలు వెచ్చించి త్రాగునీటి పథకం ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ అప్పలనాయుడు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజల సమస్యలను తీర్చడం పట్లపలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. గురువారం నాడు ఆ గ్రామంలో కుళాయిల ద్వారా నీరు సరఫరా ప్రారంభించారు. గతంలో ఆ గ్రామ ప్రజలు కలుషితమైన నీరు తాగి ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇకపై ఆ ఆరోగ్య ఇబ్బందులు ఉండవని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • Related Posts

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని ఎస్ఐ రామ లింగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా లేని పలు…

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకువద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏలేశ్వరం, లింగంపర్తి, రాజవొమ్మంగి, అడ్డతీగల (ఎల్లవరం), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.