అన్నవరంలో కొత్త రైల్వే స్టేషన్…

శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరంలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను త్వరలో చేపడతామని ఛైర్మన్, విజయవాడ రైల్వే డి‌విజనల్ మేనేజర్ నరేంద్ర ఆనంద్ పాటిల్ వెల్లడించినట్టు విజయవాడ రైల్వే వినియోగదారుల సలహా మండలి సభ్యులు, మండలంలోని కొంతంగి కొత్తూరు జనసేన నాయకులు గొర్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలో డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశాన్ని చైర్మన్ అధ్యక్షతన బుధవారం ఉదయం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలను గొర్లి నాగేశ్వరరావు ప్రస్తావించారు. ఆ విశేషాలను ఓ ప్రకటనలో మీడియాకు నాగేశ్వరరావు తెలిపారు. కాకినాడ నుండి షిరిడి వెళ్లే షిరిడి సాయి నగర్ రైలులో ఏసి ‌బోగీలు ఎక్కువగా ఉండటం వలన పేద, మధ్యతరగతి ప్రయాణికులకు భారం కనుక, జనరల్ బోగీలు ఎక్కువగా పెంచాలని, ‌ఎల్.టి టి, న్యూఢిల్లీ, గరీబ్ రథ్ రైళ్ళతో పాటు మిగతా రైళ్ళను కూడా కాకినాడ పార్లమెంటు పరిధిలో తుని,అన్నవరం రైల్వే స్టేషన్లలో ‌నిలుపుదల చేయాలని, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని సమావేశంలో నాగేశ్వరరావు కోరారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అన్నవరం దేవస్థానం పెద్దది కావడంతో రోజుకు 50,000 వేల మంది భక్తులు వరకూ సత్యదేవుడిని దర్శించు కోవడానికి వస్తారని అదేవిధంగా తమలపాకుల రైతులకు తుని నుంచి నేరుగా బొంబాయికి రైలు లేక తమలపాకుల రైతులు తొలుత సికింద్రాబాదుకు అక్కడ నుంచి తిరిగి బొంబాయికి ఎగుమతి చేయడం వల్ల తమలపాకులు పాడవుతున్నాయనే వాటిని ప్రధాన సమస్యలుగా సభ దృష్టికి గొర్లి నాగేశ్వరరావు తెచ్చారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో తాగునీటి సదుపాయం, మెరుగు దొడ్లు, పారిశుధ్యం గురించి, స్టేషన్ల అభివృద్ధి వంటి అంశాలపై సమావేశంలో నాగేశ్వరరావు చర్చించారు. ఈ సమస్యల దశలవారీగా పరిష్కారానికి విజయవాడ రైల్వే డి‌.ఆర్.ఎం. నరేంద్ర ఆనంద్ పాటిల్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో 19 మంది డి.ఆర్.యు.సి.సి. సభ్యులు పాల్గొన్నారు.

  • Related Posts

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్…

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు