దేశ రాజకీయాల్లో చంద్రబాబు ఒక లెజెండ్….ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలుమాజీ సర్పంచ్ మమత ఆధ్వర్యంలో వెయ్యి మందికి అన్నదానం…

మనన్యూస్,తిరుపతి:భారతదేశ రాజకీయాల్లోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక లెజెండ్ అని ముత్యాల రెడ్డి పల్లి మాజీ సర్పంచ్ బోయనపాటి మమత చౌదరి కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన వేడుకలను మాజీ సర్పంచ్ మమత చౌదరి ఆధ్వర్యంలో ఆదివారం ఎంఆర్ పల్లి సర్కిల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పేరిట భారీ కేకును ఏర్పాటు చేసి ఆయన ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని పార్టీ నేతల మధ్య కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మబ్బు దేవనారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుమార్ వెయ్యి మంది పేదలకు మాజీ సర్పంచ్ మమత ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిపాలన దక్షత కలిగిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని, ఆయన మరో 20 ఏళ్లు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేలా ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. విజనరీ లీడర్ అనే పదానికి చంద్రబాబు నిలువెత్తు నిదర్శనం అన్నారు. 2047 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుందని, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారడం ఖాయమని ఆమె చెప్పారు. ఈ అన్నదాన కార్యక్రమంలో మన్యం శ్రీనివాసులు, కృష్ణ యాదవ్, ఏపీ నాయుడు, బాల రమేష్, బాబు రాజేంద్రప్రసాద్, ప్రవీణ్, మస్తానీ, తులసిరెడ్డి, నిరంజన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి