దుబాయ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ సమ్మిట్ లో తిరుపతి యువతి

మనన్యూస్,తిరుపతి:దుబాయిలో ఇటీవల మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ ఉమెన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమ్మిట్ లో తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి కుమార్తె పి కృత్తికా రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోకోకోలా, మైక్రోసాఫ్ట్, అన్ లివర్, డెలాయిట్ వంటి కంపెనీలతోపాటు ఇతర కంపెనీల సీఈఓ లతో వ్యాపారాల అభివృద్ధి, సక్సెస్ సాధించడం వంటి అంశాలపై కృత్తికా రెడ్డి సమావేశంలో సుదీర్ఘంగా వివరించారు. సమ్మిట్ కు హాజరైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు కంపెనీల సీఈఓ లు కృత్తికా రెడ్డి ఉపన్యాసానానికి మంత్రముగ్ధులయ్యారు. అక్కడికి వచ్చిన సీఈవోలు ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల తరఫున కృత్తికా రెడ్డి ఒక్కరే హాజరు కావడం రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణం. ఈమె తిరుపతిలోని భారతీయ విద్యా భవన్ లో పదో తరగతి వరకు చదువుకున్నారు. హైదరాబాద్ లోని బిట్స్ పిలానిలో కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎస్పీ జైన్ గ్లోబల్ మేనేజ్మెంట్, దుబాయిలో ఎంబీఏ విద్యను అభ్యసిస్తున్నారు. ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలలో తిరుపతికి చెందిన యువతి కృత్తికా రెడ్డి ప్రపంచవ్యాప్త కంపెనీల సిఈఓ ల సమిట్ లో పాల్గొని ప్రసంగించడం ఎంతో అభినందనీయమని తెలుగు రాష్ట్రాలకు చెందిన మేధావులు శాస్త్రవేత్తలు, విద్యావంతులు ప్రశంసలతో ముంచెత్తారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..