దుబాయ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ సమ్మిట్ లో తిరుపతి యువతి

మనన్యూస్,తిరుపతి:దుబాయిలో ఇటీవల మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ ఉమెన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమ్మిట్ లో తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి కుమార్తె పి కృత్తికా రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోకోకోలా, మైక్రోసాఫ్ట్, అన్ లివర్, డెలాయిట్ వంటి కంపెనీలతోపాటు ఇతర కంపెనీల సీఈఓ లతో వ్యాపారాల అభివృద్ధి, సక్సెస్ సాధించడం వంటి అంశాలపై కృత్తికా రెడ్డి సమావేశంలో సుదీర్ఘంగా వివరించారు. సమ్మిట్ కు హాజరైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు కంపెనీల సీఈఓ లు కృత్తికా రెడ్డి ఉపన్యాసానానికి మంత్రముగ్ధులయ్యారు. అక్కడికి వచ్చిన సీఈవోలు ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల తరఫున కృత్తికా రెడ్డి ఒక్కరే హాజరు కావడం రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణం. ఈమె తిరుపతిలోని భారతీయ విద్యా భవన్ లో పదో తరగతి వరకు చదువుకున్నారు. హైదరాబాద్ లోని బిట్స్ పిలానిలో కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎస్పీ జైన్ గ్లోబల్ మేనేజ్మెంట్, దుబాయిలో ఎంబీఏ విద్యను అభ్యసిస్తున్నారు. ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలలో తిరుపతికి చెందిన యువతి కృత్తికా రెడ్డి ప్రపంచవ్యాప్త కంపెనీల సిఈఓ ల సమిట్ లో పాల్గొని ప్రసంగించడం ఎంతో అభినందనీయమని తెలుగు రాష్ట్రాలకు చెందిన మేధావులు శాస్త్రవేత్తలు, విద్యావంతులు ప్రశంసలతో ముంచెత్తారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!