

మనన్యూస్,నెల్లూరురూరల్:తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో సైతం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేదానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ వ్యక్తి బీద రవిచంద్ర.బీద రవిచంద్ర గారి ఎమ్మెల్సీ నిర్ణయం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది.శ్రీధర్ అన్నతో నాకు 35 ఏళ్ళ అనుబంధం… బీద రవిచంద్ర ఎమ్మెల్సీ. కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చేదాంట్లో రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ మొదటి స్థానంలో ఉంది… బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రెండవసారి శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన బీద రవిచంద్రకి అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ.శ్రీధర్ అన్నతో నాకు 35 ఏళ్ళ అనుబంధం ఉంది.కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చేదాంట్లో రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ మొదటి స్థానంలో ఉంది అని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. ఒకేరోజు 105 శంకుస్థాపనలు ప్రజలచేత చేయించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంతోషించారు అని బీద రవిచంద్ర ఎమ్మెల్సీ అన్నారు. పొట్టేపాళెం, ములుముడి కలుజులపై వంతెనల నిర్మాణానికి బాధ్యత తీసుకుంటా అని బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ అన్నారు.తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో సైతం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేదానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ వ్యక్తి బీద రవిచంద్ర అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
బీద రవిచంద్ర ఎమ్మెల్సీ నిర్ణయం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
