స్పందించిన జడ్జి _ మతి స్థిమితం లేని యువతికి వైద్యం

మనన్యూస్,కాకినాడ:సుమారు పది రోజుల నుంచి కాకినాడ నగరంలో మతిస్థిమితం లేక శరీరంపై సగం దుస్తులు కప్పుకుని తిరుగుతున్న యువతికి మానవీయ కోణంలో ఒక జడ్జి స్పందించగా ఆమె ఆదేశాలతో వైద్యం అందుతోంది. పైగా ఆ మతిస్థిమితం లేని యువతికి జడ్జి సహకారంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించడమే కాక మామూలు స్థితికి వచ్చే పరిస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, మూడవ అదనపు జిల్లా కోర్టు జడ్జి పి కమలాదేవి బుధవారం కోర్టు ప్రాంగణంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు రోజుల క్రితం తాను బయటకు వస్తుండగా మతిస్థిమితం లేక ఒంటిపై సగం దుస్తులు కప్పుకొని అక్కడక్కడ తిరుగుతున్న యువతిని చూచానని దీంతో ఆమె ఆచూకీ గమనించాలని తమ సిబ్బందితో పాటు పోలీసులకు తెలియజేశానన్నారు. ఆమె సుమారు పది రోజుల నుంచి కాకినాడ నగర ప్రాంతాల్లో ఈ విధంగా తిరుగుతుందని పోలీసులు బదులివ్వడంతో తాను ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. ఈ విషయంపై ఆమెకు మానసిక వైద్యం అందివ్వాలని వైద్యులు దిశ వన్ స్టాప్ సిబ్బంది తెలియడంతో తాను ప్రత్యేకంగా రిసెప్షన్ అనే ఆర్డర్ నిచ్చానని దీంతో ఆమెకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ఆమె వివరాలు కొద్దిగా తెలుసుకున్నామని కమలాదేవి చెప్పారు. ఆ యువతి కాకినాడ నగరానికి చెందినట్లుగాను వైద్య విద్య చదివినట్లుగా విచారణలో తేలిందన్నారు. త్వరలోనే ఆ యువతిని పూర్తి వివరాల సేకరించిన పిమ్మట వారి ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఈ విధంగా మతిస్థిమితం లేక ఎంతోమంది యువతులు దుస్తులు లేకుండా తిరిగేవారు ఉన్నారని వారి పట్ల ఎంతో దయగా వ్యవహరించాలని వీరి కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఉపయోగించుకుని అండగా నిలవాలని కమలాదేవి హితవు పలికారు.

  • Related Posts

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    మన న్యూస్,కావలి, ఏప్రిల్ 24:-*కుటుంబ సభ్యులని పరామర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా ఎస్పీ.*కుటుంబానికి అండగా ఉంటామని హామీ.ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ…కశ్మీర్ ఉగ్రవాద ఘటన పిరికిపంద చర్య,పేద కుటుంబానికి చెందిన మధుసూదన్ మృతి చెందడం దురదృష్టకరం…

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన న్యూస్,కోవూరు, ఏప్రిల్ 24:– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్థశ పట్టిందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అన్నారు. భవిష్యత్తులో కోవూరు నియోజకవర్గం నుంచి రాష్ట్రస్థాయిలో తొలిర్యాంకు సాధించేలా చూడాలన్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

    పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    తెలుగుదేశం నాయకుడు సోమవరపు సుబ్బారెడ్డి మృతితో ఒక ఆత్మియుని కోల్పోయాను-చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి

    తెలుగుదేశం నాయకుడు సోమవరపు సుబ్బారెడ్డి మృతితో ఒక ఆత్మియుని కోల్పోయాను-చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి