

మనన్యూస్,నెల్లూరు:కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి వేడుకలు నాయకులు, కార్యకర్తలు
నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైసీపీ సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అఖండ విజయం సాధించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు,మిత్రులు అభిమానులు, కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా కార్యకర్తలు బాణసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు.నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రాకతో కార్యాలయం వైసీపీ నగర కిక్కిరిసింది.కార్యకర్తల సందడి తో.. పార్టీ పరిసర ప్రాంతాలన్ని కోలాహాలంగా మారాయి.
పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగి విద్యాసంస్థలు స్థాపించి నేడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అద్భుతమైన సేవలందిస్తున్నారని వారు తెలిపారు.ఎమ్మెల్సీగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కి గెలుపు ఒక చరిత్ర అని పేర్కొన్నారు.నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ గా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సేవలందిస్తూ నెల్లూరు రెడ్ క్రాస్ కు దేశ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారని తెలిపారు. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏ రంగంలో అడుగుపెట్టిన ఆ రంగానికి వన్నె తెచ్చే విధంగా ఆయన సేవలందిస్తున్నారని కొనియడారు. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సేవలను మెచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ బాధ్యతలు అప్పగించారని తెలిపారు.సిటీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రజల పట్ల ఆయన చూపుతున్న ఆదరణకు ప్రజల్లో ఎనలేని అభిమానం సంపాదించుకున్నారని తెలిపారు .సిటీ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సారధ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకోవడం ఖాయమని తెలిపారు.ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సారథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా తామంతా పనిచేసి మళ్లీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేసుకుంటామన్నారు.
