మామిడి సీజన్ లో సమస్యలు లేకుండా చూస్తాం…రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం

మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి.

మామిడి సీజన్ కి సంబంధించి అన్ని విభాగాల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం

మనన్యూస్,అబ్దుల్లాపూర్ మెట్:బాటసింగారం పండ్ల మార్కెట్ లో మామిడి దిగుమతులు వస్తున్న నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం కార్యాలయం ఆవరణలో మామిడి వ్యాపారస్తులు,సంబంధిత అన్ని శాఖల అధికారులు,మార్కెట్ సిబ్బంది,పాలకవర్గం తో కలిసి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా మామిడి వ్యాపారులు సీజన్ లో ఎదుర్కొంటున్న సమస్యలను,సలహాలను తెలియచేయడం జరిగింది.వారు తెలియపర్చిన సమస్యలకు అధికారులు పాలకవర్గం సమాధానం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద మామిడి దిగుమతులు ఎగుమతులు బాటసింగారం పండ్ల మార్కెట్ లో జరుగుతున్నాయని,ఈ సంవత్సరం ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తామని రైతులు,వ్యాపారులు,అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటామని అన్నారు.కనీస వసతులు కలిపిస్తామని,రైతులకు విశ్రాంతి,వైద్య సేవలు,ట్రాఫిక్,లా అండ్ ఆర్డర్ వంటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.ఎప్పడు లేని విధంగా ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపడతామని అన్నారు.గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఒక కుటుంబంలా ఉండి ఎక్కడ సమస్య ఉన్న దగ్గరుండి పరిష్కరిస్తామని అన్నారు.అధిక కమీషన్లు వసూలు చేస్తే మార్కెట్ లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ అంజిరెడ్డి,ట్రాఫిక్ సీఐ గట్టుమల్లు,ఫైర్ స్టేషన్ సీఐ యాదగిరి,మార్కెట్ వైస్ చైర్మన్ బాస్కర చారి,మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్,పాలకవర్గం సభ్యులు బండి మధుసూదన్ రావు,రఘుపతి రెడ్డి,జైపాల్ రెడ్డి.అంజయ్య,లక్ష్మి,నరసింహ,గోవర్ధన్ రెడ్డి,నవరాజ్,గణేశ్ నాయక్,మచ్చెందర్ రెడ్డి,వెంకటేశ్వర్లు గుప్తా,ఇబ్రహీం తో పాటు మార్కెట్ కమిటీ అధికారులు,పలువురు వ్యాపారులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు