

మన న్యూస్,కామారెడ్డి: మాచారెడ్డి మండలం అంబేద్కర్ వద్ద మరియు వాడి గ్రామంలో ఎలాంటి అనుమతి పత్రాలు లేని మరియు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ అన్నారు మండల కేంద్రంలో గల గ్రామాలలో అనుమతి లేకుండా అక్రమ ఇసుక రవాణాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.