- తిరుపతి రూరల్ గొల్లపల్లికి చెందిన మురళి రెడ్డి తండ్రి పూడి మునికృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా స్వర్గస్తులవడం పట్ల తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
- గొల్లపల్లి స్మశాన వాటికలో జరిగిన మునికృష్ణారెడ్డి దహనక్రియల కార్యక్రమంలో డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొని,మునికృష్ణారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళులర్పించారు.
- అనంతరం వారి కుమారుడు మురళి ని, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మునికృష్ణారెడ్డి పవిత్ర ఆత్మకు ప్రశాంతత చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు.


