ఉగ్రవాదులను ఉద్యమకారులుగా, రైతులను ఉగ్రవాదులలా చూడడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు రైతులకు బేడీలు వేయటం సిగ్గు చేటు

మన న్యూస్: కామారెడ్డి జిల్లా రేవంత్ రెడ్డి పాలనకి, KCR పాలన కి తేడా ఏమీ లేదు మారింది పాలకులు మాత్రమే పాలన కాదు KCR కి పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుంది దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమంలో బీజేపీ నాయకులు లగచర్ల రైతులకు బేడీలు వేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండు వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులను ఉద్యమకారులుగా, రైతులను ఉగ్రవాదులలా చూడడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదనీ అన్నారు. లగచర్ల ఘటనలో అక్రమంగా అరెస్టయి జైల్లో ఉన్న గిరిజన రైతుకి గుండెనొప్పి రావడంతో, తనను ఆసుపత్రికి తీసుకెళ్ళేందుకు ఉగ్రవాదులకు వేసినట్టు బేడీలు వేసి తీసుకెళ్ళడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. రైతులకు బేడీలు వేయటం సిగ్గు చేటు అని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనకి, KCR పాలన కి తేడా ఏమీ లేదనీ మారింది పాలకులు మాత్రమే పాలన కాదనీ ప్రజలకి అర్థం అవుతుందని అన్నారు. గత ఎన్నికల్లో KCR కి పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుందనీ జోస్యం చెప్పారు. కల్లబొల్లి మాటలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తీవ్ర రైతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వేణు, రవీందర్, రాజు, రజినీ కాంత్, రాజేష్, రాజగోపాల్, సాయి, గోవర్ధన్, మహేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ ) పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.44 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి…

    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మూడు ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు.నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన ఒక ట్రాక్టర్‌ను నిన్న అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.మాగి గ్రామ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    • By RAHEEM
    • November 18, 2025
    • 2 views
    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

    • By RAHEEM
    • November 17, 2025
    • 7 views
    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్