ఉగ్రవాదులను ఉద్యమకారులుగా, రైతులను ఉగ్రవాదులలా చూడడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు రైతులకు బేడీలు వేయటం సిగ్గు చేటు

మన న్యూస్: కామారెడ్డి జిల్లా రేవంత్ రెడ్డి పాలనకి, KCR పాలన కి తేడా ఏమీ లేదు మారింది పాలకులు మాత్రమే పాలన కాదు KCR కి పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుంది దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమంలో బీజేపీ నాయకులు లగచర్ల రైతులకు బేడీలు వేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండు వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులను ఉద్యమకారులుగా, రైతులను ఉగ్రవాదులలా చూడడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదనీ అన్నారు. లగచర్ల ఘటనలో అక్రమంగా అరెస్టయి జైల్లో ఉన్న గిరిజన రైతుకి గుండెనొప్పి రావడంతో, తనను ఆసుపత్రికి తీసుకెళ్ళేందుకు ఉగ్రవాదులకు వేసినట్టు బేడీలు వేసి తీసుకెళ్ళడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. రైతులకు బేడీలు వేయటం సిగ్గు చేటు అని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనకి, KCR పాలన కి తేడా ఏమీ లేదనీ మారింది పాలకులు మాత్రమే పాలన కాదనీ ప్రజలకి అర్థం అవుతుందని అన్నారు. గత ఎన్నికల్లో KCR కి పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుందనీ జోస్యం చెప్పారు. కల్లబొల్లి మాటలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తీవ్ర రైతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వేణు, రవీందర్, రాజు, రజినీ కాంత్, రాజేష్, రాజగోపాల్, సాయి, గోవర్ధన్, మహేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర