కలిగిరి, మన ధ్యాస, జనవరి 29,(నాగరాజు కె ).
గురువారం కలిగిరి మండల విద్యాశాఖాధికారి -2 గోళ్ళ.సురేష్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన “ఉత్తమ సేవా పురస్కారం” ను నెల్లూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ హిమాన్షు శుక్ల చేతులమీదగా అవార్డు అందుకున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యు.టి. ఎఫ్)- కలిగిరి మండల శాఖ తరపున ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలిగిరి మండల యు.టి.ఎఫ్ అధ్యక్షులు వై.ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎస్ కె.రియాజ్, కలిగిరి సీనియర్ నాయకులు మరియు జిల్లా కౌన్సిలర్స్ జి. వెంకటేశ్వర్లు (జి.వి), జి.శేషగిరిరావు, కె భాస్కర్ రెడ్డి, జి.మురళీ కృష్ణ (జి.ఎమ్.కె) ఎన్. నాగార్జున,మహేశ్వర రావు, ఎస్ కె.షంషుద్దీన్, కె.వి.ఎస్.యు.ప్రతాప్,ఎమ్ రాంబాబు,ఎస్ కె. మహబూబ్ భాష, ఎ.నాగేంద్ర తదితరులు*