శ్రీ దత్తాత్రేయ సిద్ధ మంగళ పూర్ణాహుతి హోమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

ఓం శ్రీ దత్తాత్రేయ నమః నాదంతో ప్రతిధ్వనించి మైపాడు సముద్ర తీరం.శ్రీ రామానంద భారతీ స్వామి వారి సారధ్యంలో వైభవంగా శ్రీ దత్త హోమ పూర్ణాహుతి పూజా మహోత్సవం.
మన ధ్యాస,ఇందుకూరుపేట, డిసెంబర్ 6:
నెల్లూరు జిల్లా,కోవూరు నియోజవర్గం ,ఇందుకూరు పేట మండలం మైపాడు సముద్ర తీరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దువ్వూరు కళ్యాణ్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శనివారం పూజ్యశ్రీ రామానంద భారతి స్వాముల వారు విశిష్ట అతిధులుగా విచ్చేసి నిర్వహించిన శ్రీ దత్తాత్రేయ సిద్ధ మంగళ పూర్ణాహుతి హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి శ్రీ దత్తాత్రేయ సిద్ధ మంగళ పూర్ణాహుతి హోమంలో పాల్గొని శ్రీ రామానంద భారతి స్వాముల వారిచే వేదాశ్వీరాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…… శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు తలపెట్టిన 33 కోట్ల సిద్ధ మంగళ పారాయణ దీక్షలో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్టాలకు చెందిన వేలాది మంది భక్తులు 120 రోజుల పాటు సామూహికంగా సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేస్తున్నారన్నారు. మైపాడు వేదికగా పవిత్ర సాగర తీరంలో శ్రీ దత్తాత్రేయ సిద్ధ మంగళ పూర్ణాహుతి హోమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరు పేట టిడిపి అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, చెంచు కిషోర్ యాదవ్, ముంగర గోపాల్, మధు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం