ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు)

అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తొలి స్నాతకోత్సవ కార్యక్రమం లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఫిజియోథెరపీ కోసం కావలి వాసులు దూర ప్రాంతాలకు పోయేందుకు అనేక వ్యయ ప్రయాసలకు లోను అవుతున్న తరుణంలో మాధవరెడ్డి కావలి లో ఈ విద్యా కేంద్రం ఏర్పాటు చేయడమే కాక ఫిజియోథెరపీ వైద్యం అందుబాటులోకి తేవడం సామాన్య మైన విషయం కాదని అన్నారు. యువతకు సులభంగా ఉపాధి అవకాశాలు కలిగించే క్రమంలో లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్ మరింత ఉన్నత స్థాయి కి ఎదగాలని క్రిష్ణా రెడ్డి, వంశీకృష్ణ లు కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ మాధవరెడ్డి మాట్లాడుతూ 2000 సంవత్సరం లో ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభం లో కావలి లో ఎందుకు అని పేరు పలువురు శ్రేయోభిలాషులు వారించారని, జన్మభూమి అయిన కావలి ప్రాంతంలో తాను నేర్చుకున్న విద్య పలువురికి అందించాలనే లక్ష్యంతో ఎన్నో ఇబ్బందుల మధ్య మొదలు పెట్టిన సంస్థ అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని తెలిపారు. యన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ కి అనుబంధం గా ఉన్న తమ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో ప్రధమ ర్యాంకు పొందారని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. భవిష్యత్తు లో అందరి ఆశీస్సులతో మరిన్ని విజయాలు సాధిస్తామని, తన తండ్రి నారాయణ రెడ్డి ఆశయం నెరవేరుస్తామని మాధవ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా స్నానకోత్సవంలో విద్యార్థులకు యమ్ యల్ ఎ క్రిష్ణా రెడ్డి,ఆర్ డి ఒ వంశీ కృష్ణ పంపిణీ చేశారు.కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ మాధవరెడ్డి అంకిత భావంతో ఎంతటి బాధ్యత అయినా చేస్తారని ఆయన పై విశ్వాసం తో తాను భాగస్వామిని అయ్యానని ఈ విజయం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ యస్.గోపి కన్నన్ నేతృత్వంలో విద్యార్థుల, తల్లి తండ్రుల, సన్నిహితుల మధ్య తొలి స్నాతకోత్సవం విజయవంతం గా ముగిసింది.

  • Related Posts

    కలిగిరి ఆర్ అండ్ బి బంగ్లా నందు ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ 69వ వర్ధంతి..

    కలిగిరి, మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 06,(కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 96వ వర్ధంతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి…

    ఏపీ లో పదో తరగతి విద్యార్ధులకు బంపరాఫర్‌..ఇకపై పరీక్ష ఫీజు విద్యార్థులే ఆన్‌లైన్‌లో చెల్లించే సౌకర్యం కల్పించిన ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్, మన ధ్యాస, డిసెంబర్ 06 (కె ఎన్ రాజు). ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు 2025-26 విద్యా సంవత్సరానికి వచ్చ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి జరగనున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే పరీక్షల ఫీజు చెల్లింపులు కూడా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    బాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి

    బాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి

    సంజోష్ తగరం హీరోగా పరిచయం అవుతున్న ‘మై లవ్’ చిత్రం ఘనంగా ప్రారంభం

    సంజోష్ తగరం హీరోగా పరిచయం అవుతున్న ‘మై లవ్’ చిత్రం ఘనంగా ప్రారంభం

    దారి ఇవ్వలేదని ఎస్టీ వ్యక్తిపై కుల దూషణ, దాడి: మాజీ సర్పంచ్‌ బోధపాటి గోవిందప్ప పై కేసు నమోదు చేయాలని బాధితుడి డిమాండ్

    దారి ఇవ్వలేదని ఎస్టీ వ్యక్తిపై కుల దూషణ, దాడి: మాజీ సర్పంచ్‌ బోధపాటి గోవిందప్ప పై కేసు నమోదు చేయాలని బాధితుడి డిమాండ్

    కామాలూరుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్

    కామాలూరుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్