సంగం వద్ద సోమశిల జలాల విడుదల — రైతాంగంలో ఆనందం వెల్లువ..!,రెండవ కారు పంటకు నీటి అందుబాటు: సోమశిల నుంచి కావలి కాలువకు జలాలు..!

సంగం నవంబర్ 18 మన ధ్యాస న్యూస్://

సంగం వద్ద కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసి, రెండవ ఫేస్ లో రబ్బి పంటలకు నీటిని అందించేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మరియు సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ప్రజాప్రతినిధులు జలవిడుదలను అధికారికంగా ప్రారంభించి, రైతాంగంలో ఆనందం వెల్లివిరిసెల చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు, యువనేత మంత్రి నారా లోకేష్ బాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యలను అర్థం చేసుకుని వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించేందుకు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడి అన్ని ప్రాజెక్టులు, చెరువులలో పుష్కలంగా నీరు నిండిపోయి నిండుకుండలను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పుష్కల వర్షాల వరదతో ఎన్నడూ లేని విధంగా రెండవ కారు పంటకు నీరు విడుదల చేయడం రైతులకు ఎంతో ఆశాజనకమని, ఇది వ్యవసాయ రంగానికి పునర్జీవం నింపే నిర్ణయమని తెలిపారు.అలాగే, రైతుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ నిర్ణయాలను కూడా ఆయన వివరించారు. రేపు రెండో విడతగా రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా ప్రతి రైతు ఖాతాలో 5,000 రూపాయలు జమ చేయనున్నదని, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా అదనంగా 2,000 రూపాయలు రైతులకు చేరనున్నాయని పేర్కొన్నారు. ఈ రెండు పథకాల మద్దతుతో రైతుల భుజాలపై ఉన్న ఆర్థికభారం కొంతవరకు తగ్గి, పంట సాగు మరింత సులభమవుతుందని అన్నారు. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ ద్వారా సోమశిల జలాలను ఉదయగిరి నియోజక వర్గంలోని ప్రతి ఒక్క ఇంటికి త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *