కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

సంగం వద్ద సోమశిల జలాల విడుదల — రైతాంగంలో ఆనందం వెల్లువ..!,రెండవ కారు పంటకు నీటి అందుబాటు: సోమశిల నుంచి కావలి కాలువకు జలాలు..!

సంగం నవంబర్ 18 మన ధ్యాస న్యూస్://

సంగం వద్ద కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసి, రెండవ ఫేస్ లో రబ్బి పంటలకు నీటిని అందించేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మరియు సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ప్రజాప్రతినిధులు జలవిడుదలను అధికారికంగా ప్రారంభించి, రైతాంగంలో ఆనందం వెల్లివిరిసెల చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు, యువనేత మంత్రి నారా లోకేష్ బాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యలను అర్థం చేసుకుని వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించేందుకు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడి అన్ని ప్రాజెక్టులు, చెరువులలో పుష్కలంగా నీరు నిండిపోయి నిండుకుండలను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పుష్కల వర్షాల వరదతో ఎన్నడూ లేని విధంగా రెండవ కారు పంటకు నీరు విడుదల చేయడం రైతులకు ఎంతో ఆశాజనకమని, ఇది వ్యవసాయ రంగానికి పునర్జీవం నింపే నిర్ణయమని తెలిపారు.అలాగే, రైతుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ నిర్ణయాలను కూడా ఆయన వివరించారు. రేపు రెండో విడతగా రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా ప్రతి రైతు ఖాతాలో 5,000 రూపాయలు జమ చేయనున్నదని, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా అదనంగా 2,000 రూపాయలు రైతులకు చేరనున్నాయని పేర్కొన్నారు. ఈ రెండు పథకాల మద్దతుతో రైతుల భుజాలపై ఉన్న ఆర్థికభారం కొంతవరకు తగ్గి, పంట సాగు మరింత సులభమవుతుందని అన్నారు. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ ద్వారా సోమశిల జలాలను ఉదయగిరి నియోజక వర్గంలోని ప్రతి ఒక్క ఇంటికి త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    కలిగిరి, మన న్యూస్, డిసెంబర్ 17,(కె నాగరాజు). రాష్ట్ర శాసన మండల సభ్యులు బీద రవిచంద్ర తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా ఎంపిక కావడం శుభ పరిణామం అని ఉదయగిరి నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య…

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    వింజమూరు,మన న్యూస్,డిసెంబర్ 16,(కె నాగరాజు). తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయము నందు వరికుంటపాడు మండల పరిధిలోని తూర్పురొంపిదొడ్ల గ్రామంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడేలా డ్వాక్రా సంఘాలకు సబ్సిడీ రుణాల పంపిణీ ద్వారా గ్రామీణ మహిళలకు జీవనోపాధి అవకాశాలు పెంచడం,చిన్నతరహా మరియు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల.

    సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల.