పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం మంత్రి జూపల్లి కృష్ణారావు టూరిజం ప్రమోషన్ లో భాగంగా నిజాంసాగర్ సందర్శన

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) వందేండ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్‌ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక ప్రమోషన్ లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు నిజాంసాగర్ ప్రాజెక్టు ను సందర్శించారు. ఈ..నిజాంసాగర్‌లో ప్రాచీన కట్టడాలైన, గోల్ బంగ్లా, గుల్‌గస్త్‌ బంగ్లా, వీఐపీ గార్డెన్‌, స్విమ్మింగ్‌ పూల్‌ కట్టడాలను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో కలిసి పరిశీలించారు. పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను సంబంధిత అధికారులతో ఆయన చర్చించారు. నిజాంసాగర్ జాలాశాయంతో పాటు పరిసరాల ప్రాంతాల అభివృద్ధికి 12 ఎకరాల స్థలాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థకు రెవిన్యూ శాఖ అప్పగించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు జలాశయంలో ఆహ్లాదం కోసం బోటింగ్, జలాశయం దిగువన కాటేజీలు, ఉద్యానవనం, చిన్న పిల్లల పార్కు సౌకర్యాలు అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆయన సూచించారు. అనంతరం నిజాసాగర్ హెడ్ లుస్ పవర్ స్టేషన్ ను సందర్శించారు. మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వర ప్రదాయిని నిజాంసాగర్‌ ప్రాజెక్టు పర్యాటక ప్రదేశాలు అద్భుతంగా ఉందని, వందేండ్లు గడిచిన చెక్కుచెదరలేదని ఆయన అన్నారు. మూడు కాలాలు ఎప్పడు నిండుకుండలా ఉన్న నిజాంసాగర్ జలాశయం పర్యాటక అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు త్వరలోనే నూతన పర్యాటక పాలసీ అమల్లోకి తెస్తామని వెల్లడించారు. నిజాంసాగర్ హైడ్ లుస్ పవర్ స్టేషన్ లో 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని, త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తో చర్చించి, దీన్ని పూర్తిగా ఆధునికరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మి కాంతారావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్, మండల రెవెన్యూ అధికారి బిక్షపతి, పిట్లం వ్యవసాయ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్, నిజాంసాగర్ మండలం అధ్యక్షులు మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, పర్యాటక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ ) పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.44 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి…

    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మూడు ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు.నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన ఒక ట్రాక్టర్‌ను నిన్న అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.మాగి గ్రామ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    • By RAHEEM
    • November 18, 2025
    • 2 views
    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

    • By RAHEEM
    • November 17, 2025
    • 7 views
    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్