BREAKING NEWS, మంత్రి రాక సందర్భంగా..జుక్కల్ లో ముందస్తు అరెస్టులు…

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యకర్తలకు ముందస్తు అరెస్టు బహుమతి ఇచ్చిన ఎమ్మెల్యే 
ఇది జూకల్ ఎమ్మెల్యే పనితీరుకు అద్దం పడుతుంది. తన గెలుపు కోసం కష్టపడ్డ నాయకులకి, కార్యకర్తలకి ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేస్తూ అరుదైన వార్షిక బహుమతి ఇచ్చిన ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు. మంత్రి జూపల్లి కృష్ణారావు రాక సందర్భంగా, ముందస్తుగా జుక్కల్ బ్ నియోజకవర్గంలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. కేవలం భరాసాన్ని ఎలాగైనా ఓడించి జుక్కల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇక్కడ అభివృద్ధి జరగాలి అనేక ఇబ్బందులకి గురి అవుతున్న తమ కార్యకర్తలు నమ్ముకున్న ప్రజలు సంతోషంగా ఉండాలి అన్న ఆలోచనతోనే అనామకుడిగా నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ని నమ్మి నియోజకవర్గంలోని ప్రతి గడపగడపకి స్వయంగా భరోసా ఇస్తూ పరిచయం చేసి అనేక ఒత్తిళ్లు అవమానాలు ,బెదిరింపులకి గుడి అవుతూ ఎమ్మెల్యే గా గెలిపిస్తే తమ గెలుపు అని భావించి నిద్రాహారాలు మాని మొదటి నుండి కష్టపడి నాయకులు కార్యకర్తలను శనివారం ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు  నియోజకవర్గానికి వస్తున్న కారణంగా ప్రతిపక్ష నాయకులని ముందస్తు అరెస్టు చేసినట్టు కష్టపడ్డ కార్యకర్తలని అరెస్టు చేయించారు.భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కొత్త, వింత పనికి శ్రీకారం చుట్టారు తనకోసం ఒక సమయానికి సొంత కుటుంబాన్ని సహితం పక్కనపెట్టి తామే ఎమ్మెల్యేగా నిలుచున్నాము అన్న విధంగా ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని కష్టపడ్డ నాయకులను కార్యకర్తలను ప్రైవేటు అరెస్టు చేయించారు గతంలో అసెంబ్లీ ఎలక్షన్లలో బారాస అలాగే పార్లమెంట్ ఎలక్షన్లలో బిజెపి నుండి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని కనుమరుగు లేకుండా చేయాలని తిరిగిన నాయకులను పక్కన కూర్చోబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కాలికింద వేసి తొక్కుతున్నటుగా ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ తనకోసం పనిచేసిన నాయకులు గానీ కార్యకర్తలు గాని ఏదైనా సమస్య లేదా ఏదైనా పని గురించి అడిగితే వారిని ఎటువంటి డిమాండ్ చేయలేరు .కాబట్టి కొంతమంది కాంగ్రెస్ పార్టీ లో ఉన్న దళారులు , ఓటు కూడా వేయని నాయకులను పక్కన పెట్టుకుంటే తను ఇష్టారాజ్యంగా ఏదైనా చేయవచ్చు అన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు.ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేకి కనీసం ఓటు కూడా వేయలే కాబట్టి బొమ్మల్లా ఉంటారని ప్రతిపక్ష నాయకులు , సామాన్య ప్రజలు అనుకుంటున్నారు.
అరెస్ట్ అయిన వారిలో మాజీ జడ్పీటిసి జయప్రదీప్, మాజీ జడ్పిటిసి కమల్ కిషోర్,మండల అధ్యక్షులు సంజీవ్ పటేల్, ఎక్స్ ఎంపీపీ లక్ష్మణ్ పటేల్,  మాజీ ఎంపిటిసి సురేష్, మాజీ సర్పంచ్ వినోద్, మాజీసర్పంచ్ విట్టల్ రావు పటేల్ మాజీ ఏఎంసి చైర్మన్ సంగమేశ్వర్ వారితో పాటు నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా మన న్యూస్ దినపత్రికకు జయప్రదీప్ చరవాణి ద్వారా మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధి బాటలో వస్తున్న మంత్రిని మేము ఎందుకు అడ్డుకుంటామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను తీసుకువచ్చి వర్షాలు చేయించి నిలబడి ఎమ్మెల్యే ను గెలిపిస్తే మాకు ఈ విధంగా చేయడం సరికాదని ఆయన అన్నారు. ముందస్తుగా అరెస్టు విషయంపై పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం