కౌలాస్ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కౌలాస్ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దరం జరుగుతుందని టూరిజంశాఖ మంత్రి ,జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో గల ప్రసిద్ధిగాంచిన,పురాతనమైన కౌలాస్ కోటను ఆయన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తో కలిసి పరిశీలించారు.వందలాది నిచ్చేనాలు ఎక్కుతూ, బండరాళ్లు,చెట్ల పొదల మధ్యల నుండి ముందుకు సాగుతూ కోట ఖండాలను,పురాతన శిల్పాలు,గత వైభవలను మంత్రి జూపల్లి కృష్ణారావు తిలకించారు. కోట బురుజు పై ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద 9గజాల ఫిరంగి పరిశీలించటం జరిగింది. గతంలో దాని ఉపయోగించిన తిరును కౌలాస్ కోట వంశీయులు అనూప్ కుమార్ మంత్రికి వివరించారు. ప్రాచీన కళాఖండాలు,ప్రాచీన కట్టడాలు ప్రాచీన వైభవాలను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని,తెలంగాణ ప్రభుత్వం దానికి ప్రాముఖ్యత ఇస్తుంది కాబట్టి కౌలస్ కోటను పర్యాటక స్థలంగా తీర్చదిద్దటం జరుగుతుందని,కోట ముందు ఉన్న కౌలాస్ నాల పై వంతెన నిర్మించి కౌలాస్ నాల ప్రాజెక్టును కూడా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు.ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కార్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి,డీఎఫ్ఓ నిఖిత,ఆయా శాఖల ఉన్నతాధికారులు,కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,కౌలాస్ గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం