మాలేపాటి భానుచందర్ అకాల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

మాలేపాటి భానుచందర్ అకాల మరణంపై శోకసంద్రంలో దగదర్తి – ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ..!

దగదర్తి, అక్టోబర్ 19 :(మన ధ్యాస న్యూస్ )://

దగదర్తి మండలానికి చెందిన ప్రముఖ తెలుగు దేశం పార్టీ యువ నాయకుడు మాలేపాటి భానుచందర్ (మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్రనాయుడు కుమారుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు అన్న కుమారుడు) ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు.ఆయన అకాల మరణం స్థానిక ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్ర విషాదంలో ముంచేసింది.ఈ వార్త తెలిసిన వెంటనే ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వ్యక్తిగతంగా దగదర్తికి చేరుకుని, భానుచందర్ వారి పార్థివదేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పిస్తూ, “భానుచందర్ వంటి యువ నాయకుడు పార్టీకి, ప్రాంతానికి, సమాజానికి గొప్ప ఆస్తి. ఆయన అకాల మరణం తీరని లోటు” అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఉదయగిరి మండల కన్వీనర్ చింతనబోయిన బయన్న, వింజమూరు మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, కలిగిరి మండల కన్వీనర్ బిజ్జం కృష్ణారెడ్డి, కలిగిరి మండల మాజీ ఎంపీపీ మద్దసాని వెంకటేశ్వర్లు, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు బొల్లినేని రామారావు, మాజీ ఉదయగిరి మండల కన్వీనర్ బొజ్జ నరసింహులు, సీనియర్ నాయకులు ఘంటా నరసింహులు, తిరుపతి నాయుడు, జలదంకి మండల తెలుగు యువత నాయకులు మునగాల తిరుమల రెడ్డి, జలదంకి సొసైటీ చైర్మన్ అప్పలనాయుడు, డైరెక్టర్ మధుసూదన్, మల్లినేని శ్రీనివాసులు నాయుడు, గంట అశోక్, నల్లిపోగు నరసింహులు, చెరుకూరి శ్రీనివాసులు,తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి అక్టోబర్ 28 :(మన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?