
నెల్లూరు, అక్టోబర్ 13 :(మన ధ్యాస న్యూస్):///
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్,కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో,భారీ నిరసన దర్నా చేపట్టారు ఈసందర్బంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగ,ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగలు మాట్లాడుతూ అక్టోబర్ 7, 2025 న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారు బెంచ్ మీద లాయర్ల వాదనలు వింటున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూస్ విసిరి దాడికి పాలు పడడాన్ని నిరసిస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది,చీఫ్ జస్టిస్ గారి మీద జరిగిన దాడి అనాగరికమైంది.ఈ దాడి ప్రజాస్వామిక స్ఫూర్తి, రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే ఉన్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసిందని.దళిత పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని. అందువల్ల దేశ ప్రజలందరూ ఈ దాడిని ఖండించారు.ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఈఎఫ్ నాయకులు బెజవాడ పాపయ్య మాదిగ, ఏగూరి వెంకటేశ్వర్లు మాదిగలు,దళితుడైన బిఆర్ గవాయి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కావడం కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందుకే అహంపూరితంగా ఈ దాడికి తెగపడ్డారని
ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి డిమాండ్ చేశారు,అలాగే దాడికి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి శిక్షలు పడేలా ఈ ఘటన మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కోరారు,అందుకోసం సుప్రీం కోర్టులో అనుభవం కలిగిన ప్రజస్వామిక దృక్పథం కలిగిన రిటైర్డు జడ్జీలను దర్యాప్తు కోసం నియమించాలి ఈ డిమాండ్లను తక్షణమే పరిగణలోని తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని తమరి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం అని నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ నాయకులు తాళ్ళూరి శేషయ్య మాదిగ,బర్రె ప్రసాద్ మాదిగ,ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు మంద సుజాత మాదిగ,జిల్లాలోని నియోజకవర్గాలలో సీనియర్ నాయకులు మండల ఇన్చార్జీలు చింతకుంట అంకయ్య మాదిగ,అక్కిలగుంట ఏసు మాదిగ,బెజవాడ బాల గురవయ్య మాదిగ,తాటిపర్తి లక్ష్మయ్య మాదిగ,ఎంఎఎంఎస్ నాయకులు గంగపట్ల లక్ష్మమ్మ మాదిగ, వడ్లపల్లి రమణమ్మ మాదిగ,
,కొమరిక రమణయ్య మాదిగ,ఏసుపోగు జయరాజ్ మాదిగ,గొల్లపల్లి మోహన్ రావు మాదిగ,కావలి శ్రీనివాస్ మాదిగ,గంగపట్ల సింహాద్రి మాదిగ,ఎన్ గంగాధర్ మాదిగ,ఎం వెంకటేష్ మాదిగ,డి శ్రీనివాస్ మాదిగ,వి కృష్ణయ్య మాదిగ,గోచిపాతల ఆనంద్ రావు మాదిగ,ఎన్ వెంగళరావు మాదిగ,బర్రె అర్జున్ మాదిగ,నరసింహ మాదిగ, ఏడుకొండలు మాదిగ,డేవిడ్ మాదిగ,సీహెచ్ కిరణ్ మాదిగ,కె మళ్ళికార్జున మాదిగ,డి వాసు మాదిగ,కె శివ మాదిగ,ఎన్ రత్నం మాదిగ,టి వెంకటరమణయ్య మాదిగ,కె వెంటయ్య మాదిగ,ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ ఎంఎంఎస్ ఎంఈఎఫ్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పోల్గొన్నారు.







