వరికుంటపాడు, సెప్టెంబర్ 30: (మనధ్యాస న్యూస్:):////
వరికుంటపాడు మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు 55వ జన్మదిన వేడుకలు పామూరులోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదిన కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మండల కన్వీనర్ మధుసూదన్ రావు ను జడ్పిటిసి రావిళ్ల నాగేంద్ర, సొసైటీ అధ్యక్షులు గుర్రం గోపి,మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్, మండల తెలుగు యువత అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మండల వైస్ ఎంపీపీ దేవన బోయిన మధు, సొసైటీ డైరెక్టర్ మానం కొండలరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు పొద మాధవరావు, మాజీ గండిపాలెం డ్యాం చైర్మన్ సుంకర సత్యం, మాజీ ఏఎంసీ డైరెక్టర్ లోకసాని రవికుమార్, తెల్లగొర్ల వెంకటయ్య, తాతపూడి లాబాన్, నందిపాటి ఆరోన్,పత్తి జానీ బాయ్, మాలెం హజరత్ రెడ్డి, ఆరికొండ వెంకటరత్నం, వేమసాని తిరుపాల్, టిడిపి నాయకులు కార్యకర్తలు శాలువాలు, పూలమాలతో సత్కరించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటంతో ఘనంగా సన్మానించారు.