ఉదయగిరి సెప్టెంబర్ 5: మన న్యూస్ ప్రతినిధి నాగరాజు :///

ఉదయగిరి మండలం అప్పసముద్రం పంచాయతీ నందు గత శుక్రవారం వినాయక చవితి నిమర్జనం లొ చోటు చేసుకొన్న బాణా సంచ పేలుడు ప్రమాదం లో గాయపడిన చిన్నారులను, ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి లో ,నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటున్న చిన్నారులను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకట్ రెడ్డి . చిన్నారులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తూ,వారికి అవసరమైన మెరుగయిన వైద్యం అందించడానికి అన్ని విధాలుగా తోడుంటానని తెలపటం జరిగింది. ప్రస్తుత వైద్య ఖర్చులకు ప్రతి పిల్లవాళ్లకి 15000 చొప్పున 5మంది పిల్లల కీ కలిపి 75000వారి కుటుంబ సభ్యులకు అందచేయటం జరిగింది.అదేవిధంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి సహకారం తొ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని , తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా తోడుంటుంది అని తెలియపరచటం జరిగింది. ముందు ముందు ఇటువంటి వీ జరగకుండా తగిన చర్యలు తీసుకొంటామని ఆయన పేర్కొనటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *