నీటిలో మునిగిన ఇండ్లను పరిశీలించిన అధికారులు – ప్రజలకు పాఠశాలలో ఆశ్రయం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్​నగర్ మండలంలోని తునికిపల్లి గ్రామం వరద బారిన పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులు, వాగులు పొంగిపొర్లడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.గ్రామ ప్రజలు బయటకు రావడానికి వీలు లేకుండా పరిస్థితి ఏర్పడటంతో ఆందోళన నెలకొంది.సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా ట్రాక్టర్​ను ఏర్పాటు చేసి నీట మునిగిన ఇండ్లలోని ప్రజలను ఒక్కొక్కరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో పలు ఇళ్లలోకి నీరు చేరడంతో అక్కడి పరిస్థితి మరింత విషమంగా మారింది. అధికారులు స్వయంగా ట్రాక్టర్‌లో గ్రామానికి వెళ్లి ప్రతి ఇల్లు పరిశీలించారు.నీటిలో ఇళ్లు మునిగిన కుటుంబాలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలికంగా ఆశ్రయం కల్పించారు. వారికి భోజనం, త్రాగునీరు, అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు ఎవరూ ఇబ్బందులు పడకూడదని అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మహమ్మద్ నగర్ తహశీల్దార్ సవాయి సింగ్, డిప్యూటీ తహశీల్దార్ క్రాంతి కుమార్, ఆర్​ఐ పండరి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గ్రామానికి వెళ్లి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.వరద ప్రభావం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ మళ్లీ నీటిమునిగిన ఇళ్లలోకి వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.అవసరమైతే మరిన్ని సహాయక చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

  • Related Posts

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!