మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సమరయోధుల త్యాగ ఫలమే.

  • ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ *
  • ఉచిత బస్సు స్త్రీ శక్తి పధకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-

నేడు మన యావత్ దేశ 140 కోట్ల భారత పౌరులు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలమేనని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పేర్కొన్నారు. ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి(బుజ్జి) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన 79 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత రత్న, పూజ్య బాబా సాహెబ్, భీమారావ్ రాంజీ అంబేద్కర్, జాతిపిత, మహాత్మా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ చిత్రపటాలకు పూల మాలలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి దివ్య స్మృతికి అంజలి ఘటించారు. వారి దేశ సేవలను స్మరించుకున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.‌ జాతీయ జెండాకు వందనాన్ని సమర్పించారు.‌ అనంతరం సభికులను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు. పరదేశీయుల పాలన నుంచి మన దేశ విముక్తి, స్వేచ్ఛా, స్వాతంత్రాల కోసం ప్రాణత్యాగం చేసి అమరులైన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మరువ లేమన్నారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ , స్వాతంత్ర్యాలు ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాలు ఫలితం అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ, ఈ దేశ పౌరుల భవిష్యత్తు నిర్మాణానికి పునాదులు వేసుకుంటూ, వికసిత్ భారత్ వైపు సమాజం అడుగులు వెయ్యాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి తీపి తినుబండారాలను పంపిణీ చేశారు. ఇదే కార్యక్రమంలో మండలంలోని పేరవరం గ్రామానికి చెందిన నిమ్మకాయల అప్పన బాబు, సూరిబాబులతో ఐదుగురు సభ్యుల రైతు సంఘానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ రాయితీ ధరకు సరఫరా చేసిన డ్రోనును ఎమ్మెల్యే అందజేసారు. రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు. అందులో భాగంగానే వ్యవసాయ పంటలకు మందులను పిచికారీ చేయడానికి ఉపయోగించే రూ. 10,000,00 విలువ చేసే డ్రోనును కేవలం రూ. 2,000,00 లకే అందించింది అన్నారు. ఒక్కో డ్రోన్ పై రూ. 8,000,00 లను రాయితీని రైతుల తరఫున ప్రభుత్వమే భరిస్తోంది అన్నారు. వ్యవసాయాన్ని యాంత్రీకరించాలి తద్వారా రైతులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పధకాల హామీల అమలులో భాగంగా రాష్ట్రంలో అంతర్గతంగా వివిధ జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే స్త్రీ శక్తి పధకాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. ఏలేశ్వరం ఆర్టీసీ డిపోలో ఉచిత బస్సుకు పురోహితులు శాస్త్రోక్తంగా పూజలను చేసారు. అనంతరం బస్సుకు ఎమ్మెల్యే టెంకాయలు కొట్టి పధకాన్ని ప్రారంభించారు. మహిళలకు ఉచిత ప్రయాణ జీరో టిక్కెట్లను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ చేశారు. స్త్రీ శక్తి పధకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చిత్ర పటానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో రైతులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు