మర్డర్ కేసును చేదించిన దేవునిపల్లి పోలీసులు

మన న్యూస్: జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉగ్రవాయి గ్రామ శివారులో ఒక మగ వ్యక్తి చనిపోయినాడు అని సమాచారం రాగా మేము అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతుని వయసు సుమారు 25 సంవత్సరాల కలదు. అయితే తేదీ 30. నాడు మద్యానం ఒక వ్యక్తి దేవునిపల్లి పోలీసు స్టేషన్ కు వచ్చి తను చేసిన నేరం ఒప్పుకుంటూ తన పేరు కోదండం సాయిలు గోసంగి కాలనీ అని, చనిపోయిన వ్యక్తి తన కొడుకు కోదండం రాజు అని తెలిపినాడు. దర్యాప్తు లో బాగంగా లోతుగా విచారించగా మృతుడు కోదండం రాజు ఎటువంటి పని చేయక తాగుడు కు బానిస అయి ప్రతి రోజు మద్యం తాగి తన తండ్రి సాయిలు, తల్లి సాయవ్వ ను మరియు ఇద్దరు చెల్లెలను ఇష్టం వచ్చినట్లు తిట్టడం, కొట్టడం తో సాయిలు అతని మానసిక మరియు శారీరక వేదింపులు బరించలేక అతనిని చంపి వేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందు నిమిత్తమై అతను ఒక పథకం రచించుకొని కామారెడ్డి కి చెంధీన అనిల్ అనే వ్యక్తి తో కలిసి తన కొడుకు రాజు ని చంపుటకు నిర్ణయించుకున్నాడు. అంధుకు అనిల్ కు ఒక లక్ష రూపాయలు సుపరి మాట్లాడుకున్నాడు. వారి రివురు వేసుకున్న పథకం ప్రకారం తేదీ 29. నాడు రాత్రి 9గంటలకు మృతుడు రాజు కు ఫుల్లుగా మద్యం తాగించి స్పృహ లేకుండా చేసి అతనిని అనిల్ యొక్క మోటార్ సైకల్ పై తీసుకొని వెళ్ళి ఉగ్రవాయి శివర్ లోని SH-11 కు కొద్ది దూరం లో వ్యవసాయ భూమి లో అతని గొంతు చుట్టూ టవల్ తో ఊరి గా వేసి అతన్ని ఊపిరాడకుండా చేసి చంపి శవాన్ని అక్కడే ఉంచి పారిపోయినారు, ఇట్టి విషయమై ఇద్దర్ని పట్టుకొని అరెస్టు చేయగా, వారు చేసిన నేరం ఒప్పుకున్నారు. తదుపరి రెండు మోటార్ సైకల్ లు మరియు రెండు ఫోన్ లు స్వాదినపర్చుకొనైనది.
ఇట్టి కేసు దర్యాప్తుల పాల్గొని 24 గంటల్లో మర్డర్ కేసుని చేదించిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు, క్రైమ్ టీం సిబ్బంది రవికిరణ్, శ్రీనివాస్ గౌడ్, రాజు లను జిల్లా ఎస్పీ డి.ఎస్.పి అభినందించారు.

  • Related Posts

    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ ) పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.44 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి…

    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మూడు ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు.నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన ఒక ట్రాక్టర్‌ను నిన్న అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.మాగి గ్రామ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    • By RAHEEM
    • November 18, 2025
    • 2 views
    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

    • By RAHEEM
    • November 17, 2025
    • 7 views
    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్