

బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసులు.
బంగారుపాళ్యం నవంబర్ 30 మన న్యూస్:- మద్యం తాగి వాహనాలు నడిపిన 06 గురికి 10,000 చొప్పున 60,000/- రూ. మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన 07 మందికి 1,000 చొప్పున 7,000/- రూ మొత్తం 67,000/- రూ జరిమానా విధింపు.**జిల్లా ఎస్పీ వి.ఎన్ మణికంఠ చందోలు, ఐపీఎస్ ఆదేశాల మేరకు పలమనేరు సబ్ డివిజన్ డి.ఎస్పీ ప్రభాకర్ ఆద్వర్యంలో బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్ కత్తి .శ్రీనివాసులు నిన్నటి దినం వాహన తనిఖీ చేస్తున్న సమయంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఇద్దరు(6) పట్టుబడగా, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ 07 మంది పట్టుబడ్డారు. ఈ రోజు ఉదయం వీరిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టుకు హాజరుపర్చగా, జడ్జి శ్రీమతి ఉమా దేవి గారు మద్యం తాగి వాహనాలు నడిపిన వ్యక్తులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 60,000/- రూపాయలు జరిమానా విధించారు. అదేవిధంగా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 07 మందికి ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున 7,000/- రూపాయలు జరిమానా విధించారు. మొత్తం 67,000/- రూపాయల జరిమానా విధించడం జరిగింది. బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్ శ్రీ కె.శ్రీనివాసులు గారు మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరు తప్పక పాటించాలని, అటువంటి నియమాలు పాటించకపోతే భారీ జరిమానాలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు. మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదకరమైన చర్యగా, ఇది తమ ప్రాణాలకు మరియు ఇతరుల ప్రాణాలకు భయానక ప్రమాదం అని తెలిపారు. సెక్షన్ 185 ప్రకారం, మద్యం సేవించి వాహనం నడపడం పై మొదటిసారి రూ. 10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష, రెండవసారి నేరం చేస్తే రూ. 15,000 లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుందని ఇన్స్పెక్టర్ గారు వివరించారు.