ఉపాధి శ్రామికులకు హాజరు తప్పనిసరి,అంటున్న డ్వామా పీడీ గంగభవాని..!!!

వింజమూరు,(మననన్యూస్,ప్రతినిధి,నాగరాజు):

ఉపాధి హామీ శ్రామికులకు రెండు పూటల హాజరు తప్పనిసరిగా ఉండాలని డ్వామా పిడి గంగాభవాని తెలిపారు. గురువారం వింజమూరు పంచాయతీ పరిధిలో మోట చింతలపాలెం చెరువు నందు జరుగుతున్న ఫిష్ పాండ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధి శ్రామికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధి హామీ శ్రామికులు తప్పనిసరిగా రెండు పూటలా పనులకు వెళ్లి తమ హాజరు వేయించుకోవాలని అలా లేనియెడల ఆరోజు పని చేసినప్పటికీ కూలీ నమోదు కాదని తెలిపారు. త్వరలో ఫిష్ యాప్ వస్తుందని, దాని ప్రకారం ఉదయం సాయంత్రం రెండు పూటలా ఫోటోలు తీయించాలని వాటిని అప్లోడ్ చేసినట్లయితే ఆరోజు కూలి నమోదు అవుతుందన్నారు. ఉదయాన్నే 6 గంటలకు పనిలోకి వెళ్లి ఫోటో తీయించుకున్న తర్వాత తిరిగి 11గంటలకు ఫోటో తీంచుకోవాలని ఆ రెండు ఫోటోలు అప్లోడ్ కావడానికి రెండు పూటలా పనులు చేయాలని తెలిపారు. అదే విధంగా క్షేత్ర సహాయకులు సూచించిన పని కొలతలను చేసి 307 రూపాయలు కూలీని పొందాలన్నారు. సమయపాలన పాటించి పనులు చేసుకోవాలని తెలిపారు. ఉద్దేశించిన కొలతల ప్రకారం రెండు పూటల పనులు చేసి నిర్దేశించిన వేతనాన్ని పొందాలని ఆమె తెలిపారు. కావున ఉపాధి శ్రామికులు ఉపాధి హామీ అధికారులు సూచించిన సూచనల మేరకు పనులు చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఈసీ కృష్ణారావు, టిఏ మురళి, క్షేత్ర సహాయకులు శ్రీనివాసులు, ఉపాధి హామీ శ్రామికులు ఉన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..