పుట్టపర్తి లో ఘనంగా రెడ్డి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం

పుట్టపర్తి, శ్రీ సత్యసాయి జిల్లా, జూలై 6 (మన న్యూస్): – ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నేడు శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి నాయకులు, విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి కింది తీర్మానాలను ఆమోదించారు. రెడ్డి కులస్తులపై దాడులు చేసే వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలనే తీర్మానం చేయబడింది. ఇటువంటి దాడులను ఖండిస్తూ బాధితులకు తోడుగా రెడ్డి సంఘం నిలుస్తుందని స్పష్టం చేశారు. రెడ్డి కార్పొరేషన్‌కి చైర్మన్‌ను నియమించి రూ.2000 కోట్ల నిధులను కేటాయించాలని, పేద మరియు మధ్యతరగతి వర్గానికి సబ్సిడీ రుణాలు అందించాలని కోరారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీని సులభతరం చేయాలని సూచించారు. రెడ్డి ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలను ఖండిస్తూ, వారికి మద్దతుగా సంఘం నిలుస్తుందని, ఈ చర్యలను ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. అక్రమంగా రెడ్డి కులస్తులపై నమోదవుతున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై పూర్తి విచారణ జరపాలని, ఈ కేసులకు న్యాయపరంగా సహాయం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో త్వరలోనే పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. ఈ తీర్మానాలన్నింటినీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు గంగుల కుంట నరేష్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని గోపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు దండు ధర్మారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు నితిన్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు విశ్వనాథ రెడ్డి, ఉపాధ్యక్షుడు బండి దామోదర్ రెడ్డి, చిత్తూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కంబాల చేను జితేందర్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు పాటిల్ రామకృష్ణారెడ్డి, సత్యసాయి జిల్లా అధ్యక్షుడు బాబుల్ రెడ్డి సహా వివిధ జిల్లాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…