రాష్ట్రం ప్రగతి బాటలో కూటమి పాలన…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) ఆధ్వర్యంలో శంఖవరం మండలం కత్తిపూడి 10 వ వార్డ్ లో టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్, బద్ది రామారావు టీడీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలు వివరించి, ఏడాదిలో ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేస్తారో అనే అంశాలను ప్రజలకు వివరించారు. ప్రజాప్రతినిధులు కరపత్రాలు పంచుతూ ఇంటింటికి తిరిగారు, సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా టిడిపి నేత వెన్న శివ మాట్లాడుతూ, కూటమి పాలనపట్ల ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని ఐదేళ్ల పాలనలో జగన్‌ దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు.అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ మాట్లాడుతూ,మహిళలు వృద్ధులతో మాట్లాడి సంక్షేమ పథకాలు, పింఛన్లు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకోవడం జరిగిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 80 శాతం నెరవేర్చినట్లు చెప్పారు. కూటమి పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో దురదృష్టకర పాలనను చూశామని ప్రజా సమస్యలను ప్రస్తావించిన వారిపై దాడులకు దిగారని విమర్శించారు. విద్యంసంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. ప్రజా సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో దశల వారీ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కూటమి పాలనలో రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తోందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రాధాన్యత ప్రకారం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కీర్తి సుభాష్, మాజీ ఎంపీటీసీ సభ్యులు సాధనాల లక్ష్మి బాబు, కంచిబోయిన శ్రీను, తదితర టిడిపి శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..