ప్రభుత్వం రైతులను ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించి నష్టపరిహారం చెల్లించాలి జైన్ మామిడి గుజ్జు కర్మాగారం వద్ద మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గ ఇన్చార్జి కృపాలక్ష్మి డిమాండ్

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- మామిడి రైతుల కన్నీళ్లు పెడుతుంటే ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి కష్టాలు పెడుతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి కృపా లక్ష్మి మండిపడ్డారు. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద బుధవారం ఫ్యాక్టరీ ఎదుట కిలోమీటర్ల మేర మామిడి ట్రాక్టర్లతో నిలుచున్న రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. అక్కడ ఉన్న రైతులు మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి, కృపా లక్ష్మికి ప్రభుత్వం తమను పెడుతున్న ఇబ్బందిని, రైతుల పడుతున్న కష్టాలను వివరించారు. ప్రభుత్వం జూన్ 7వ తేదీ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో చర్చలు జరుపగా ఎయిట్ ప్లస్ ఫోర్ అమ్ములు చేస్తామని మోసపూరితపు హామీ ఇచ్చారని, నేటి వరకు ఏ కర్మాగారంలోను ఎయిట్ ప్లస్ ఫోర్ ఇవ్వలేదన్నారు. చర్చలు మే నెలలోనే జరుపుంటే నేడు రైతు పడుతున్న ఇబ్బందులు ఉండేవి కావున్నారు.

రైతు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని మండిపడ్డారు. అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యాలు దొంగ దారిలో టోకెన్లు అమ్ముకొని రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. టోకెన్లను రెవిన్యూ అధికారులు సీరియల్ గా ఇవ్వకుండా వన్ బై వన్ మిస్ చేసి ఇవ్వడం వల్ల దొడ్డి దారిన టోకెన్ లు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. రైతుల కష్టాలను విన్న మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కృపా లక్ష్మి కూటమి ప్రభుత్వం మామిడి రైతుల జీవితాలతో ఆటలాడుకోవడం తగదని, రోజులకు రోజులు తిండి నిద్ర లేకుండా రోడ్లపై పడిగాపులు కాస్తుంటే ఇలా చేయడం దారుణమన్నారు.

ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఎయిట్ ప్లస్ ఫోర్ కచ్చితంగా అమలు చేయాలని, రోజులు గడుస్తున్న ట్రాక్టర్లలో అధిక శాతం మామిడి కుళ్ళిపోతుండడంతో ఫ్యాక్టరీ యాజమాన్యాలు రిజెక్ట్ చేయడంతో గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతుకు కుళ్ళి నా సమస్య కూడా తీవ్రమావ్వడడంతో కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పడుతున్న కష్టాలపై నివేదిక అందించామని తెలిపారు. అనంతరం రోడ్లపై మామిడిపండ్లతో వేచి ఉన్న రైతులకు నారాయణస్వామి, కృపా లక్ష్మి , మండల నాయకుల చేతుల మీదుగా అన్నదానం, మజ్జిగ , వాటర్ బాటిల్లు అందించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

  • Related Posts

    సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

    మన న్యూస్ సాలూరు జూలై 6:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నందు, స్థానిక ఆర్యవైశ్య ధర్మశాల లో ఈరోజు ఆదివారం రాష్ట్రస్థాయి 16 సంవత్సరాల లోపు బాల…

    అనంతపురంలో బీజేపీకి బలమేర్పడుతోంది: భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర బీజేపీలో చేరారు

    అనంతపురం, జులై 6 (మన న్యూస్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ అభివృద్ధికి సాకారమవుతున్న కృషిని, ప్రజల సేవా ఉద్యమాన్ని ప్రశంసిస్తూ భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. జిల్లా బీజేపీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

    సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

    అనంతపురంలో బీజేపీకి బలమేర్పడుతోంది: భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర బీజేపీలో చేరారు

    అనంతపురంలో బీజేపీకి బలమేర్పడుతోంది: భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర బీజేపీలో చేరారు

    యువకవి అంజనాద్రికి మాజీ మంత్రి రోజా అభినందనలు

    యువకవి అంజనాద్రికి మాజీ మంత్రి రోజా అభినందనలు

    శ్రీశైలం నీటి విడుదల, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆందోళనరాయలసీమ ప్రతినిధులను ‘కళ్ళులేని కబోదులు’గా న్యాయవాది కృష్ణమూర్తి ఆరోపణ

    శ్రీశైలం నీటి విడుదల, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆందోళనరాయలసీమ ప్రతినిధులను ‘కళ్ళులేని కబోదులు’గా న్యాయవాది కృష్ణమూర్తి ఆరోపణ

    ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు జన్మదిన వేడుకలు

    ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు జన్మదిన వేడుకలు

    పీర్లకు వెండి గుర్రం, శంకు-చక్రాలను అందించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

    పీర్లకు వెండి గుర్రం, శంకు-చక్రాలను అందించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి