మీరు చూపిస్తున్న అభిమానం మరవలేనిది..నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోలేనిది…

మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం

శంఖవరం/రౌతులపూడి మన న్యూస్ (అపురూప్):- ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న అభిమానం మరవలేనిదని కొన్ని దశాబ్దాల కాలం నుండి నా తండ్రి నుండి నన్ను, నా కుమారుడు గిరిబాబును కూడా మీరందరూ ఆదరించి ముందుకు నడిపించి మా కుటుంబానికి గుర్తింపు ఇచ్చి ఉన్నత స్థాయికి చేర్చిన నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోలేనిదని మాజీ మంత్రి, పీఏసీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం అన్నారు. రౌతులపూడి గ్రామంలో వాసిరెడ్డి దేవుళ్ళు, ఐస్ లను ముద్రగడ పద్మనాభం, తన తనయుడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ గిరిబాబు తో మర్యాదపూర్వకంగా కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రాజవరం గ్రామంలో వైసీపీ నేత సోమరౌతు తిరుమల వెంకన్న దొర నివాసంలో ముద్రగడ పద్మనాభం, ముద్రగడ గిరిబాబును వైసిపి కార్యకర్తలు, నాయకులు అభిమానులు కలిశారు. ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని కూటమి ప్రభుత్వం చేసే వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నేను ఈ స్థాయికి వచ్చాను అంటే నియోజకవర్గ ప్రజలు చూపించిన అభిమానంతోనే ఈ స్థాయిలో ఉన్నానన్నారు. ములగపూడి లో మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ అంకంరెడ్డి సతీష్ నివాసంలో ముద్రగడ కార్యకర్తలను అభిమానులను కలిశారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న తన తనయుడు గిరిబాబును మీరందరూ నన్ను ఆశీర్వదించినట్టే గిరిబాబును కూడా ఆశీర్వదించి రాజకీయాల్లో ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లాలని గిరిబాబును ఒక ఉద్యమకారుడుగా తీసుకువెళ్లే బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, జడ్పిటిసి గొల్లు దివానం, వాసిరెడ్డి జమీల్, కాకి నాని, వైస్ ఎంపీపీ సాయి, సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    బీఎస్పీ ప్రత్తిపాడు ఇన్చార్జిగా గునపర్తి అపరూప్…

    శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి (అపురూప్):- వెనుకబడిన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలంటే రాజకీయంగా పురోగతి సాధించాలని, బహుజనులకు రాజ్యాధికారం దక్కినపుడే ఆర్థిక, రాజకీయ, సమానత్వం, అభివృద్ధి సాధ్యమవుతుంద‌ని బహుజన సమాజ్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ నూత‌న ఇంచార్జ్ గునపర్తి…

    పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

    మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం స్థానిక బాలయోగి నగర్ మరియు ఊర్లపాలెం మెయిన్ పాఠశాలల నందు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ నేడు పదవి విరమణ పొందిన జేడీ సుబ్బారావు మరియు రావినూతల డేవిడ్ జయకుమార్ లను ఘనంగా సన్మానించారు. ముందుగా మండల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    బీఎస్పీ ప్రత్తిపాడు ఇన్చార్జిగా గునపర్తి అపరూప్…

    బీఎస్పీ ప్రత్తిపాడు ఇన్చార్జిగా గునపర్తి అపరూప్…

    మీరు చూపిస్తున్న అభిమానం మరవలేనిది..నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోలేనిది…

    మీరు చూపిస్తున్న అభిమానం మరవలేనిది..నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోలేనిది…

    పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

    పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

    నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు.

    నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు.

    చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, పోలీసు, రెవిన్యూ అధికారులు.

    చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, పోలీసు, రెవిన్యూ అధికారులు.

    రాష్ట్రస్థాయి క్రీడ పాఠశాలల ప్రవేశ పోటీలలో నారాయణ పేట జిల్లా క్రీడాకారుల ప్రతిభ.

    రాష్ట్రస్థాయి క్రీడ పాఠశాలల ప్రవేశ పోటీలలో నారాయణ పేట జిల్లా క్రీడాకారుల ప్రతిభ.