మీరు చూపిస్తున్న అభిమానం మరవలేనిది..నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోలేనిది…

మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం

శంఖవరం/రౌతులపూడి మన న్యూస్ (అపురూప్):- ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న అభిమానం మరవలేనిదని కొన్ని దశాబ్దాల కాలం నుండి నా తండ్రి నుండి నన్ను, నా కుమారుడు గిరిబాబును కూడా మీరందరూ ఆదరించి ముందుకు నడిపించి మా కుటుంబానికి గుర్తింపు ఇచ్చి ఉన్నత స్థాయికి చేర్చిన నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోలేనిదని మాజీ మంత్రి, పీఏసీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం అన్నారు. రౌతులపూడి గ్రామంలో వాసిరెడ్డి దేవుళ్ళు, ఐస్ లను ముద్రగడ పద్మనాభం, తన తనయుడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ గిరిబాబు తో మర్యాదపూర్వకంగా కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రాజవరం గ్రామంలో వైసీపీ నేత సోమరౌతు తిరుమల వెంకన్న దొర నివాసంలో ముద్రగడ పద్మనాభం, ముద్రగడ గిరిబాబును వైసిపి కార్యకర్తలు, నాయకులు అభిమానులు కలిశారు. ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని కూటమి ప్రభుత్వం చేసే వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నేను ఈ స్థాయికి వచ్చాను అంటే నియోజకవర్గ ప్రజలు చూపించిన అభిమానంతోనే ఈ స్థాయిలో ఉన్నానన్నారు. ములగపూడి లో మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ అంకంరెడ్డి సతీష్ నివాసంలో ముద్రగడ కార్యకర్తలను అభిమానులను కలిశారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న తన తనయుడు గిరిబాబును మీరందరూ నన్ను ఆశీర్వదించినట్టే గిరిబాబును కూడా ఆశీర్వదించి రాజకీయాల్లో ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లాలని గిరిబాబును ఒక ఉద్యమకారుడుగా తీసుకువెళ్లే బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, జడ్పిటిసి గొల్లు దివానం, వాసిరెడ్డి జమీల్, కాకి నాని, వైస్ ఎంపీపీ సాయి, సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..