

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం 33 వ వార్డు ఎస్ ఆర్ ఏ టాకీస్ వెనుక వైపు శానిటేషన్ చాలా ఇబ్బందికరంగా ఉందనే స్థానికుల సమాచారం మేరకు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ సూచనల తో….. టీడీపీ నాయకులు 4వ క్లస్టర్ కో – కన్వీనర్ ఆరికట్ల మస్తాన్ నాయుడు , 18వ యూనిట్ కన్వీనర్ ఎండి అబ్దుల్ రహీం లు ఆ ఏరియా శానిటరీ సెక్రటరీ అనిల్ మరియు స్థానిక టిడిపి నాయకులతో కలసి 33 వ వార్డు నందు పర్యటించి శానిటేషన్ సమస్యలను గుర్తించి వెంటనే కమిషనర్ గారికి తెలియజేసి ఆ సమస్యను పరిష్కరించ వలసినదిగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో 33 వ వార్డు టిడిపి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరమేశ్వర్ గౌడ్, మోహన్, స్థానిక టీడీపీ నాయకులు కార్తీక్, కేశవ్, లక్ష్మణరావు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
