పసి హృదయాన్ని కాటేసిన మృత్య గుంత !

  • ఇంటి నిర్మాణానికి తవ్విన గుంతలో పడిన ముగ్గురు ఒకరు మృతి మరొకరు పరిస్థితి విషమం…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్) :- నూతనంగా ఇంటి నిర్మాణ శంఖుస్థాపన కొరకు తవ్విన గుంతలోకి ఆడుతూ పాడుతూ వెళ్ళి ప్రమాదవశాత్తూ నీళ్ళలో పడిన ఇద్దరు పాఠశాల విద్యార్థుల్లో ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రం శంఖవరంలోని అంబేద్కర్ నగర్ కాలనీలోని మండల ప్రజా పరిషత్తు ప్రాధమిక పాఠశాల సమీపంలోని ఇండియన్ మెధడిస్ట్ ఎవాంజిలిజం చర్చి పక్కనే శనివారం సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం జరిగింది.ఇటువలె నాలుగు రోజులుగా వర్షాలు విస్తరంగా పడడంతో గుంతలన్నీ నీటితో మునిగిపోయాయి. పాఠశాల నుండి ఇంటికి చేరిన చిన్నారులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లు పుస్తకాలు యూనిఫామ్ ఇంటిదగ్గర జాగ్రత్త చేసుకొని ఆటలకై వెళుతూ గుంతలు గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదే మార్గంలో వెళ్తున్న స్థానికుడు చిన్నారుల నీటిలో మునగగానే గమనించి తక్షణమే రక్షించే ప్రయత్నం చేశారు. వీరిలో ఒకరు క్షేమంగా బయటపడగా మిగిలిన ఇద్దరు భూర్తి. మహి,(7 ) (తండ్రి) సత్తిబాబు, పులి. ప్రణయ్ జోష్ (7)(తండ్రి) పులి రాధాకృష్ణ అప్పటికే మునిగిపోయి బురద నీటిని తాగడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వెంటనే శంఖవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా భూర్తి మహి మార్గ మధ్యలో చనిపోయాడు. ప్రాణ ప్రాయ స్థితిలో ఉన్న పులి ప్రవీణ్ జోష్ ను శంఖవరం ఆస్పత్రి నుండి రౌతులపూడి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు 108 అంబులెన్స్ వాహనంలో కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన భూర్తి మహి కుటుంబ సభ్యులు వార్ణనతీతంగా మారింది.మృతి చెందిన బాలురు తండ్రికి మహి మూడవ సంతానం, వీరిది వ్యవసాయ కుటుంబం, నివాసానికి ఇల్లు లేని పరిస్థితి నెలకొంది.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు