

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:త్రిబుల్ ఐటీ ప్రవేశానికి ఏలేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో అత్యున్నత ప్రతిభ కనిపించిన కోనాల వెంకట పృథ్వి నాయుడు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ తులసి లక్ష్మి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ పాఠశాల నుండి త్రిబుల్ ఐటీ ఆర్ కె వ్యాలీ కడప ఉన్న కళాశాలకు నాయుడు ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయుల యొక్క కృషి ఎంతో ఉందన్నారు. తమ విద్యార్థి ఎంత పట్టుదలతో పదవ తరగతిలో మంచి మార్కులు సాధించడంతో త్రిబుల్ ఐటీ కళాశాలలో ప్రవేశ లభించింది అన్నారు.అనంతరం ప్రధానోపాధ్యారాయాలతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.