

గూడూరు, మన న్యూస్:- చత్రపతి షాహు మహారాజ్ జయంతి వేడుకలు గురువారం గూడూరులో ఘనంగా నిర్వహించారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .మీ సందర్భంగా బిజెపి నాయకులు నాశన భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ సాహూ మహారాజ్ చేసిన సేవలను కొనియాడారు. బహుజనుల పాలిట దైవ సమానులు చత్రపతి సాహు మహారాజ్ అని పేర్కొన్నారు. ఆయన జయంతిని గూడూరులో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
