వీ పి ఆర్ విద్య విద్యార్థి ఉన్నత చదువుకు ఆర్థిక సహాయం

మన న్యూస్, నెల్లూరు:- ‘విపిఆర్ విద్య” పాఠశాలలో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థి పైచదువుకు ప్రోత్సాహం. – చెక్కు అందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . అన్ని దానాలలో విద్యా దానం గొప్పదన్న విషయాన్ని ఆచరణలో అమలు చేసి చూపుతున్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు. ఎందరో నిరుపేద విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునేందుకు వారధిగా నిలుస్తున్న VPR ఫౌండేషన్.. ప్రతిభ మరియు పేదరికమే అర్హతగా ఉచిత విద్య అందిస్తోంది. ఆ పాఠశాలలో 2023-24 సంవత్సరంలో చదివి టాప్‌ మార్కులు సాధించిన ఉదయగిరి లక్ష్మి చరణ్ అనే విద్యార్థికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఉన్నత చదువుల ఖర్చు భరిస్తానని నాడు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు 2024లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫీజు చెల్లించిన విపిఆర్‌ దంపతులు.. బుధవారం ఇంటర్‌ రెండో సంవత్సరం ఫీజును చెల్లించారు. ఈ మేరకు విపిఆర్‌ నివాసంలో విద్యార్థికి చెక్కును అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కి విద్యార్థి తండ్రి సురేష్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ కుమారుడి చదువుల ఖర్చును భరిస్తున్న వారి రుణం జన్మలో తీర్చుకోలేమని చెబుతున్నారు.

  • Related Posts

    పారిశుద్ధ్య పనులు పరిశీలించిన కమిషనర్ షేక్ ఫజులుల్లా

    గూడూరు, మన న్యూస్: . నాయుడు పేట మున్సిపాలిటీ పరిధిలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో బుధవారం జరుగుతున్న పారిశుద్ధ్య పనులను నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా పరిశీలించారు. ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకే మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా మున్సిపాలిటీలోని…

    మక్తల్ బస్టాండ్ లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు,మక్తల్ ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి.

    మన న్యూస్, నారాయణ పేట జిల్లా: పరిధిలోని మక్తల్ బస్టాండ్ లో దొంగతనాలు నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పూర్తి స్థాయిలో నిఘా ఉంచి, ఫింగర్ ప్రింట్ డివైస్ తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని మక్తల్ ఎస్ ఐ భాగ్యలక్ష్మి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    • By RAHEEM
    • June 25, 2025
    • 2 views
    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

    • By RAHEEM
    • June 25, 2025
    • 6 views
    దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

    శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

    మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.

    మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.