

మన న్యూస్ ,నెల్లూరు: నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ లో సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో ప్రారంభమైన షైనింగ్ స్టార్స్ – ప్రతిభా పురస్కారాల వేడుక పాల్గొన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి,కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్, నగర మేయర్ స్రవంతి తదితరులు.జిల్లావ్యాప్తంగా పదో తరగతిలో అత్యుత్తమ మార్కుల సాధించిన 250 మంది, ఇంటర్లో 34 మంది మొత్తం 284 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం… ఒక్కొక్కరికి రూ. 20వేలు నగదు పురస్కారం, మెడల్, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తున్న అతిధులు. జిల్లా నలుమూలల నుంచి కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు.ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ………. విద్యార్థులు మార్కులకు అందుకుంటున్న తొలి అవార్డులు ఇవి అని అన్నారు.సమాజంలోని అందరూ ఉన్నత స్థాయికి రావాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది అని అన్నారు. విద్యార్థులు అన్ని విధాలుగా రాణింప జేయాలని మంత్రి నారా లోకేష్ విద్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకువస్తున్నారు అని అన్నారు.ప్రజల కోసం శ్రమించే ప్రభుత్వం మనది అని అన్నారు.అందరి మేలు కోసం 70 ఏళ్ల యువకుడు చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారు అని అన్నారు.ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి అని అన్నారు. ప్రతి విద్యార్థి ఈ దశలోనే భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి అని అన్నారు.రేపటి విజయం కోసం నేడు మార్గాలు వేసుకోవాలి అని అన్నారు.జీవితాన్ని మీరే ఉన్నతంగా తీర్చి దిద్దుకోవాలి అని అన్నారు.ఇరవై ఐదేళ్ల లోపు చదువుకున్న వారే భవిష్యత్తును ఉన్నతంగా మార్చుకోగలరు అని అన్నారు.నేడు పడే కష్టం యాభై ఏళ్ల సుఖాన్ని తీసుకు వస్తుంది అని అన్నారు. ఓటమి నుంచి గెలుపును నేర్చుకోవాలి.పడినప్పుడే ఎదగడాన్ని నేర్చు కుంటెనే భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది అని అన్నారు.తల్లితండ్రులకు పేరు తీసుకు వచ్చినప్పుడే సమాజం విలువను ఇస్తుంది అని అన్నారు.కష్టాన్ని ఇష్టం గా మార్చుకుంటే విజయం సులభమవుతుంది అని అన్నారు.మనసే మన క్షేత్రం మార్చుకుని ఎదగాలి అని అన్నారు.









