చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి- ప్రభుత్వ వైద్యాధికారిని దుర్గ భవాని.

మన న్యూస్: పినపాక ఈ ఏడాది చలి తీవ్రత పెరగటం, చల్లటి గాలులు వీచటం, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం వలన శీతాకాలం సమీపించిన వేళ ప్రతి ఒక్కరు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ వైద్యాధికారిణి దుర్గ భవాని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె మాట్లాడుతూ ఉన్ని దుస్తులు ధరించటం ,వేడి చేసిన నీటిని త్రాగటం, ఉదయం ఎండలో నిలబడటం మూలాన చలి నుంచి రక్షించుకోవచ్చు అని అంతేకాకుండా డి విటమిన్ కూడా సమృద్ధిగా లభిస్తుందని అన్నారు. శీతల పానీయాలకు దూరంగా ఉండాలని, చలి అధికంగా ఉండే సమయాల్లో ప్రయాణాలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత మేరకు చలి తీవ్రత ఉండే సమయాల్లో ప్రయాణాలను ఆపుకుంటే మంచిదని తెలిపారు .ప్రతిరోజు వేడి నీటితో రెండుసార్లు స్నానం చేయడం, శరీరానికి కావలసినంత త్రాగునీటిని తీసుకోవాలని తద్వారా డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటామని ,పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో కూడిన ఆహారాలను తీసుకోవడం మూలాన ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. చల్లటి వాతావరణం మూలాన జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం పెరిగే అవకాశాలు ఉంటాయని, శ్వాసకోస వ్యాధులు కలిగిన వారు జాగ్రత్తలు తప్పనిసరి అని ,గతంలో జలుబు ,దగ్గు వస్తే ఐదు ఆరు రోజుల్లో తగ్గిపోయేదని కానీ ప్రస్తుత రోజుల్లో వారం లేదా రెండు వారాలు సమయం పడుతుందని అన్నారు. ఆస్తమా ,న్యుమోనియా వంటి వ్యాధులు కలవారు ఈ కాలంలో తగు జాగ్రత్తలు పాటించాలని, తమ ఆరోగ్యం పై అనుమానం వస్తే వెంటనే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చి అన్ని రకముల పరీక్షలు చేయించుకొని తగు మందులను తీసుకువెళ్లాలని సూచించారు.

  • Related Posts

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    మన న్యూస్ , కావలి: నెల్లూరు జిల్లా కావలి ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారుఆదివారం పాతూరు నుంచి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో కూటమినేతల ఆత్మీయ సమావేశానికి చేరుకుని తన…

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు