చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి- ప్రభుత్వ వైద్యాధికారిని దుర్గ భవాని.

మన న్యూస్: పినపాక ఈ ఏడాది చలి తీవ్రత పెరగటం, చల్లటి గాలులు వీచటం, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం వలన శీతాకాలం సమీపించిన వేళ ప్రతి ఒక్కరు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ వైద్యాధికారిణి దుర్గ భవాని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె మాట్లాడుతూ ఉన్ని దుస్తులు ధరించటం ,వేడి చేసిన నీటిని త్రాగటం, ఉదయం ఎండలో నిలబడటం మూలాన చలి నుంచి రక్షించుకోవచ్చు అని అంతేకాకుండా డి విటమిన్ కూడా సమృద్ధిగా లభిస్తుందని అన్నారు. శీతల పానీయాలకు దూరంగా ఉండాలని, చలి అధికంగా ఉండే సమయాల్లో ప్రయాణాలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత మేరకు చలి తీవ్రత ఉండే సమయాల్లో ప్రయాణాలను ఆపుకుంటే మంచిదని తెలిపారు .ప్రతిరోజు వేడి నీటితో రెండుసార్లు స్నానం చేయడం, శరీరానికి కావలసినంత త్రాగునీటిని తీసుకోవాలని తద్వారా డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటామని ,పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో కూడిన ఆహారాలను తీసుకోవడం మూలాన ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. చల్లటి వాతావరణం మూలాన జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం పెరిగే అవకాశాలు ఉంటాయని, శ్వాసకోస వ్యాధులు కలిగిన వారు జాగ్రత్తలు తప్పనిసరి అని ,గతంలో జలుబు ,దగ్గు వస్తే ఐదు ఆరు రోజుల్లో తగ్గిపోయేదని కానీ ప్రస్తుత రోజుల్లో వారం లేదా రెండు వారాలు సమయం పడుతుందని అన్నారు. ఆస్తమా ,న్యుమోనియా వంటి వ్యాధులు కలవారు ఈ కాలంలో తగు జాగ్రత్తలు పాటించాలని, తమ ఆరోగ్యం పై అనుమానం వస్తే వెంటనే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చి అన్ని రకముల పరీక్షలు చేయించుకొని తగు మందులను తీసుకువెళ్లాలని సూచించారు.

  • Related Posts

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    సీతారామపురం అక్టోబర్ 29(మన ధ్యాస న్యూస్) రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా సీతారామపురంలోని కురవ వీధిలో బండి రోశమ్మ ఇంటి ప్రహరీ గోడ కూలింది మరియు ఇల్లు లోపల గోడ కూడా పాక్షికంగా దెబ్బతిని పడే స్థితిలో ఉన్నదని…

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    మన ధ్యాస ,విజయవాడ, అక్టోబర్ 29: ప్రపంచంలోని అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారులలో ఒకటైన రుసల్, దాని ఉత్పత్తి ప్రక్రియలలో సామర్థ్యాన్ని పెంచడం మరియు ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడం వంటి రెండు ముఖ్యమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీలను ప్రవేశపెట్టింది.ప్రపంచ కార్యకలాపాలతో రష్యా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!