

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని మర్పల్లి గ్రామంలో 4 సీసీ టీవీ కెమెరాలు గ్రామస్థులు అందరూ కలిసి ఏర్పటు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు లేని గ్రామాలలో ప్రజలందరూ ఏకమై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలు గ్రామాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పటు చేసుకోవడం వల్ల దొంగతనాలను నివారించడం జరుగుతుందన్నారు.శాంతి భద్రత విషయంలో సీసీటీవీ ముక్య పాత్ర వయసున్నాయి. కొన్ని గ్రామాల్లో సీసీటీవీ కెమెరాలు కొన్ని గ్రామాలలో ఏర్పాటు చేసుకున్నారు కానీ అవి మరమ్మతులు చేయించుకోలేదు మరమ్మతులు చేయించుకోవాలని ఎస్ ఐ ప్రజలు సూచించారు.మర్పల్లి గ్రామంలో సిసి కెమెరాలు ప్రారంభించారు సీసీ కెమెరా వల్ల కలిగే ఉపయోగాల గురించి ప్రజల ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మర్పల్లి రాములు,గ్రామస్థులు, పోలీస్ సిబ్బంది శ్యామ్, తదితరులు ఉన్నారు.
