

బద్వేల్: మన న్యూస్: మే 29: రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఆరు అంశాలను అభివృద్ధికి మార్గదర్శకాలుగా అమలు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో బద్వేల్ నియోజకవర్గం లోని ప్రజలందరూ సభలో భారీగా పాల్గొనాలని, బద్వేల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యురాలు విజయమ్మ, యువనేత రితీష్ కుమార్ రెడ్డి ఆదేశాలతో35వ వార్డు ఇంచార్జ్ తుడిమెల్ల వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో మన జిల్లాలో జరుగుతున్న మహానాడు మూడవ రోజు మహానాడులో జరగబోవు సభలో పాల్గొనడానికి భారీ సంఖ్యలో బయలుదేరామని రాష్ట్ర అభివృద్ధిని నియోజకవర్గ అభివృద్ధిని అధినేత మాటల్లోనే వినాలని సంకల్పంతోనే సభా స్థలికి బయలుదేరామని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు