కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం …… కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

న్యూస్ ,నెల్లూరు :మైనింగ్ కేసులో అక్రమంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు చేయడాని నెల్లూరు జిల్లా పార్టీ కార్యక్రమంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి .కూటమి ప్రభుత్వాన్ని ఎవరన్నా ప్రశ్నించిన , గొంతెత్తి మాట్లాడిన అక్రమ కేసులు పెట్టి వైస్సార్సీపీ నాయకులను జైలు పాలు చేస్తున్నారు అని అన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు గడుస్తున్న రాష్ట్రంలో ఎక్కడ చూసినా కేసులు , అక్రమ అరెస్టులు తప్ప అభివృద్ధి లేదు.రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీలో యాక్టివ్ గా ఉన్న ప్రతి నాయకులు పైన , కార్యకర్తల పైన అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి వికృత ఆనందం పొందుతున్నారు అని అన్నారు.ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న అరాచక పాలనకి , అక్రమ అరెస్టులతో వేధిస్తున్న తీరుకి ప్రతిఫలం కచ్చితంగా ఉంటుంది అని అన్నారు.ఈరోజు ఇటువంటి అరాచకాలలో పాలుపంచుకుంటున్న ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు,వారు చేసిన తప్పులకి ప్రతి ఒక్కరిని కోర్టుకు లాగుతాం అని అన్నారు.ఈరోజు మా నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ని కలవడం జరిగింది. ఆయన దైర్యం గా వున్నారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలలో ద్రుష్టి పెట్టి ప్రజావ్యతిరేఖ విధానాలను ఎండగట్టాలని మాకు దిశనిర్దేశం చేయడం జరిగింది అని అన్నారు.మద్యం కుంభకోణం పేరుతో మా పార్టీలోని ముఖ్యులను కేసులలో ఇరికించి వేధించడంతోపాటు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ని కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు.మా పాలనలో మద్యం విధానంపై మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సుమారు రెండు గంటలు మీడియా సమావేశం నిర్వహించి ప్రతి పాయింట్ లెక్కలతో సహా విశదీకరించి చెప్పడం జరిగింది అని అన్నారు. దానిపై మాట్లాడలేని తెలుగుదేశం నాయకులు అపనిందలు మాత్రం వేస్తున్నారు అని అన్నారు.ప్రస్తుత ప్రభుత్వంలో మద్యం విధానం పేరుతో ముందుగానే కమిషన్లు మాట్లాడుకుని మద్యం షాపులకు ఆక్షన్లు నిర్వహించి అందులో మా పార్టీ నాయకుల తప్ప ఎవరు టెండర్ వేయకూడదని ముందుగానే భయపెట్టి ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని ఏ విధంగా తమ నాయకులు జోబుల్లోకి పంపుతున్నారో చూస్తూనే ఉన్నాం అని అన్నారు.పేద ప్రజలకి సమయం వృధా కాకుండా వారి ఇంటి వద్దకే రేషన్ పంపించేందుకు వాహనాలను ఏర్పాటు చేస్తే వాటిని రద్దుచేసి తిరిగి రేషన్ డీలర్లకి రేషన్ పంపిణీ అప్పచెప్పారు అని అన్నారు.డీలర్లు తమకు నచ్చిన సమయంలో మాత్రమే షాపులు ఓపెన్ చేసి సరిగా రేషన్ పంపిణీ చేయకపోవడం వలన ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది అని అన్నారు.మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈరోజు చేస్తున్న పాలనతో గ్రామాలలో తెలుగుదేశం నాయకులు తలెత్తుకోలేకపోతున్నారు అని అన్నారు.తెలుగుదేశం నాయకులు గ్రామాల్లోకి వస్తే జనం తిరగబడే పరిస్థితి వచ్చింది అని అన్నారు.ఈ ప్రభుత్వం పనిచేసేది గోరంత ప్రచారం మాత్రం కొండంతగా ఉంది అని అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తో సహా ప్రభుత్వంలోని పెద్దలంతా అమరావతి మీద దృష్టి పెట్టి నిధులు అన్ని అమరావతికి మళ్లించి వారికి డబ్బు మూటలు చెల్లించే కాంట్రాక్టర్లకు అత్యధిక రేటుకు పనులు అప్పజెప్పతూ అందులో కమిషనర్ రూపంలో దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అని అన్నారు.

  • Related Posts

    నెల్లూరులో జూన్ 8న కీర్తిశేషులు ఆనం వెంకట రెడ్డి విగ్రహా పునః ఆవిష్కరణ

    మన న్యూస్ ,నెల్లూరు: .ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 8 ,ఆదివారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు నగరం రామలింగాపురం “ఆనం వెంకట రెడ్డి సెంటర్” నందు విగ్రహ పునః…

    యోగా తో ఆరోగ్యం,ఆనందం.

    మన న్యూస్ సాలూరు జూన్7:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం మే 21నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి