నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు : నెల్లూరు కేంద్ర కారాగారంలో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ………. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఎంతో ధైర్యంగా ఉన్నారని తెలిపారు.చేయని తప్పుకు అక్రమ కేసు బనాయించి కూటమి ప్రభుత్వం కాకాణి గోవర్ధన్ రెడ్డి ని జైల్లో పెట్టిందన్నారు.ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి కి ఎలాంటి సంబంధం లేదని..కక్షపూరితంగానే ఇరికించారని అన్నారు. మైన్స్ కేసుకు సంబంధించి.. గత ప్రభుత్వంలోనే.. విచారణ జరిగి ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని అధికారులు రిపోర్ట్ లు ఇచ్చారని.. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష్య సాధింపు చర్యలో భాగంగా కేసు నమోదు చేసిందన్నారు.కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో.. ప్రశ్నిస్తున్న గొంతును నొక్కాలనే.. ప్రభుత్వం ఈ అక్రమ కేసు బనాయించిందన్నారు. ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు క్లీన్ చిట్ తో బయటికి వస్తారని తెలిపారు. జైల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి ని కలిసినప్పుడు.. కార్యకర్తలకు అండగా ఉండి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారని తెలిపారు.కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ జూన్ 4 వ తేదీన నిర్వహించబోయే వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారు కొన్ని సూచనలు చేశారని తెలిపారు.కాకాని గోవర్ధన్ రెడ్డి సూచనలకు అనుగుణంగా.. జూన్ 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినాన్ని.. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను అర్థమయ్యేలా వివరించి.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ..నేతల పై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన.. బెదిరేది లేదని.. మరింత దూకుడుగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, 4,16 డివిజన్ ఇన్చార్జిలు సందాని,సగిలి జయరామిరెడ్డి,వైఎస్ఆర్సిపి నాయకులు సింగంశెట్టి అశోక్, అస్లాం, కొండయ్య శేఖర్,పెంచలయ్య,వెంకటేష్, ప్రసన్న, చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    నెల్లూరులో జూన్ 8న కీర్తిశేషులు ఆనం వెంకట రెడ్డి విగ్రహా పునః ఆవిష్కరణ

    మన న్యూస్ ,నెల్లూరు: .ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 8 ,ఆదివారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు నగరం రామలింగాపురం “ఆనం వెంకట రెడ్డి సెంటర్” నందు విగ్రహ పునః…

    యోగా తో ఆరోగ్యం,ఆనందం.

    మన న్యూస్ సాలూరు జూన్7:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం మే 21నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి