

మన న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం:జొన్నవాడ తెప్పోత్సవం సందర్భంగా సోమవారం జొన్నవాడ క్షేత్రంలో శివనామస్మరణలు ప్రతిధ్వనించాయి. బుచ్చిరెడ్డి పాళెం జొన్నవాడలో వైభవంగా నిర్వహించిన శ్రీకామాక్షితాయి అమ్మవారి తెప్పోత్సవంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. భక్తి శ్రద్దలతో తెప్పోత్సవాన్ని తిలకించి శ్రీకామాక్షి తాయి అమ్మవారి ఆశీస్సులందుకున్నారు.

