శ్రీనివాస్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం

మన న్యూస్: పినపాక, ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు పినపాక నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గట్ల శ్రీనివాస్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.కాగా బుధవారం శ్రీనివాస్ రెడ్డి దశదినకర్మలు మండలంలోని ఏడూల్ల బయ్యారం గ్రామంలో ఆయన స్వగృహంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దశదినకర్మలకు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు సుమారు 2000మంది పైచిలుకు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పినపాక నియోజకవర్గం లో అన్ని మండలాల అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ నాయకులు, వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పినపాక మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం మాట్లాడుతూ గట్ల శ్రీనివాస్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని భౌతికంగా శ్రీనివాస్ రెడ్డి లేనప్పటికీ చిరస్థాయిలో అందరి గుండెల్లో నిలిచిపోతారని అన్నారు.నికార్సైన నిబద్ధత నిజాయితీ గల విలువలతో కూడుకున్నటువంటి ప్రజా నాయకుడు ఆయన అని ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతారు అన్నారు. ఆయన అకాల మరణం కార్యకర్తల నుండి మంత్రుల వరకు అందరినీ కలిచి వేసిందని ఆయన పార్టీకి చేసిన విశిష్ట సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయన కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు. మహిళా నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి, తిరుపతయ్య, గంగిరెడ్డి వెంకటరెడ్డి, ఉడుముల లక్ష్మారెడ్డి, కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, కొర్స ఆనంద్, సాయిని వెంకటేశ్వరరావు, బిజ్జా రామనాథం, మల్లయ్య, సిపిఐ నాయకులు బి.అయోధ్య, స రెడ్డి పుల్లారెడ్డి, నిమ్మల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///