శ్రీనివాస్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం

మన న్యూస్: పినపాక, ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు పినపాక నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గట్ల శ్రీనివాస్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.కాగా బుధవారం శ్రీనివాస్ రెడ్డి దశదినకర్మలు మండలంలోని ఏడూల్ల బయ్యారం గ్రామంలో ఆయన స్వగృహంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దశదినకర్మలకు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు సుమారు 2000మంది పైచిలుకు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పినపాక నియోజకవర్గం లో అన్ని మండలాల అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ నాయకులు, వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పినపాక మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం మాట్లాడుతూ గట్ల శ్రీనివాస్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని భౌతికంగా శ్రీనివాస్ రెడ్డి లేనప్పటికీ చిరస్థాయిలో అందరి గుండెల్లో నిలిచిపోతారని అన్నారు.నికార్సైన నిబద్ధత నిజాయితీ గల విలువలతో కూడుకున్నటువంటి ప్రజా నాయకుడు ఆయన అని ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతారు అన్నారు. ఆయన అకాల మరణం కార్యకర్తల నుండి మంత్రుల వరకు అందరినీ కలిచి వేసిందని ఆయన పార్టీకి చేసిన విశిష్ట సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయన కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు. మహిళా నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి, తిరుపతయ్య, గంగిరెడ్డి వెంకటరెడ్డి, ఉడుముల లక్ష్మారెడ్డి, కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, కొర్స ఆనంద్, సాయిని వెంకటేశ్వరరావు, బిజ్జా రామనాథం, మల్లయ్య, సిపిఐ నాయకులు బి.అయోధ్య, స రెడ్డి పుల్లారెడ్డి, నిమ్మల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) డోంగ్లీ మండలంలోని సిర్పూర్–మహారాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను బాన్సువాడ సబ్‌ కలెక్టర్ కిరణ్మయి స్వయంగా సందర్శించి తనిఖీ చేశారు.ఎన్నికల నియమావళిలో భాగంగా మద్యం,నగదు తదితరాలను అక్రమంగా తరలించకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని…

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు పిట్లం టౌన్ ప్రెసిడెంట్ బుగుడల నవీన్ ముదిరాజ్ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్యే తోట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    • By RAHEEM
    • December 9, 2025
    • 4 views
    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

    బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

    రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్

    రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్