మన న్యూస్ ,కోవూరు ,మే 15 :తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో..మంత్రివర్యులు నారా లోకేష్ యువ నాయకత్వంలో మా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దివ్యఆశీస్సులతో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దీవెనలతో తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షునిగా నన్నుఎన్నిక చేసినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నమస్కారాలు అమ్మ మీరు నాపై ఉంచిన ఈ బృహత్తర బాధ్యతను కోవూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రతి ఒక్కరిని కలుపుకొని నా వంతు బాధ్యతగా తెలుగుదేశం పథకాలే లక్ష్య సాధనే ధ్యేయంగా సంక్షేమ పథకాలను మరియు మీరు కోవూరు మండల అభివృద్ధికి పాటుపడుతున్న విధానాన్ని ప్రజలకు వివరిస్తూ నా బాధ్యతను నిర్వహిస్తాను .అలాగే కోవూరు మండల అధ్యక్షునిగా నా ఎన్నికకు సహకరించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అని తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.
