తెలుగుదేశం పార్టీలోకి చేరిన నెల్లూరు రూరల్ నవలాకులతోట వైసిపి నాయకులు

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 12: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం 1వ డివిజన్, నవలాకులతోటకు చెందిన వైసీపీ నాయకులు ఓట్ల పురుషోత్తం, చింతా సుబ్రహ్మణ్యం, వినుకొండ గోవింద రావు, పావేటి బాల చిన్నయ్య, దార్ల వెంకట రత్నం, బి. వెంకటేష్ మరియు వారి మిత్రబృందం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరం కలసి పనిచేద్దాం. అందరికి ఆహ్వానం పలుకుతున్నా రండి అనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నాకు ఓటు వేయనివారు, నాకువ్యతిరేకంగా చేసినవాళ్లకు కూడా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు స్వేచ్ఛగా రండి. నా చేతిలో ఉంటే చేసేదానికి మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నా దృష్టిలో కార్యకర్త బాగుంటే ఆ నాయకుడు బాగుంటాడు. ఆ పార్టీ బాగుంటుందని మనసా వాచా నమ్ముతాను అనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గతంలో నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు 26 డివిజన్లు కార్పొరేటర్లు, 18 గ్రామాల సర్పంచ్ లు, 12 ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ ఏవిధంగా గెలిచామో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 26 డివిజన్ల కార్పొరేటర్లు, 18 గ్రామాల సర్పంచ్ లు, 12 ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ గెలిచి, ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ,యువ నాయకుడు నారా లోకేష్ కి, కూటమి ప్రభుత్వానికి కానుకగా అందిస్తాం అని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, ఎమ్.డి. జావీద్, రాచూరు జానకి రామయ్య, యనమల శేషు యాదవ్, సుబ్బరామయ్య, బాబు, నాగేంద్ర, బల్లి.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    పారిశుద్ధ్య పనులు పరిశీలించిన కమిషనర్ షేక్ ఫజులుల్లా

    గూడూరు, మన న్యూస్: . నాయుడు పేట మున్సిపాలిటీ పరిధిలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో బుధవారం జరుగుతున్న పారిశుద్ధ్య పనులను నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా పరిశీలించారు. ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకే మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా మున్సిపాలిటీలోని…

    మక్తల్ బస్టాండ్ లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు,మక్తల్ ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి.

    మన న్యూస్, నారాయణ పేట జిల్లా: పరిధిలోని మక్తల్ బస్టాండ్ లో దొంగతనాలు నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పూర్తి స్థాయిలో నిఘా ఉంచి, ఫింగర్ ప్రింట్ డివైస్ తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని మక్తల్ ఎస్ ఐ భాగ్యలక్ష్మి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    • By RAHEEM
    • June 25, 2025
    • 2 views
    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

    • By RAHEEM
    • June 25, 2025
    • 6 views
    దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

    శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

    మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.

    మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.