

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 12: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం 1వ డివిజన్, నవలాకులతోటకు చెందిన వైసీపీ నాయకులు ఓట్ల పురుషోత్తం, చింతా సుబ్రహ్మణ్యం, వినుకొండ గోవింద రావు, పావేటి బాల చిన్నయ్య, దార్ల వెంకట రత్నం, బి. వెంకటేష్ మరియు వారి మిత్రబృందం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరం కలసి పనిచేద్దాం. అందరికి ఆహ్వానం పలుకుతున్నా రండి అనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నాకు ఓటు వేయనివారు, నాకువ్యతిరేకంగా చేసినవాళ్లకు కూడా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు స్వేచ్ఛగా రండి. నా చేతిలో ఉంటే చేసేదానికి మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నా దృష్టిలో కార్యకర్త బాగుంటే ఆ నాయకుడు బాగుంటాడు. ఆ పార్టీ బాగుంటుందని మనసా వాచా నమ్ముతాను అనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గతంలో నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు 26 డివిజన్లు కార్పొరేటర్లు, 18 గ్రామాల సర్పంచ్ లు, 12 ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ ఏవిధంగా గెలిచామో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 26 డివిజన్ల కార్పొరేటర్లు, 18 గ్రామాల సర్పంచ్ లు, 12 ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ గెలిచి, ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ,యువ నాయకుడు నారా లోకేష్ కి, కూటమి ప్రభుత్వానికి కానుకగా అందిస్తాం అని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, ఎమ్.డి. జావీద్, రాచూరు జానకి రామయ్య, యనమల శేషు యాదవ్, సుబ్బరామయ్య, బాబు, నాగేంద్ర, బల్లి.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
