రైతులకు అందుబాటులో ఉండి పనులు చేయాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్,పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరైన అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..
నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ ,వైస్ చైర్మన్ మారెడ్డి క్రిష్ణారెడ్డి పాలకవర్గ సభ్యులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు.. ప్రజా ప్రభుత్వంలో ప్రజలే పాలకులుగా రైతులే రాజులుగా రైతుల శ్రేయస్సు కోసం ఎన్నికైన మరుక్షణం నుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి పని చాలా నిబద్ధతో క్రమశిక్షణతో చేస్తున్నామని అన్నారు.పిట్లం మార్కెట్ కమిటీ 1993లో ప్రారంభించడం జరిగిందని,ఈ మార్కెట్ కమిటీ 11ఎకరాల విస్తీర్ణంలో వివిధ వసతులను కలిగి ఉన్నదని తెలిపారు. దీనికి అనుబంధంగా సబ్ కమిటీ నిజాంసాగర్ లో 5 ఎకరాల విస్తీర్ణంలో గిడ్డంగి సదుపాయంతో ఉన్నదని చెప్పారు.
జుక్కల్ నియోజకవర్గంలో అన్ని మండలాలకు 35 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భద్రపరుచుకోవడానికి మాత్రమే గోదాములు ఉన్నాయని. మరో లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను ఏర్పర్చుకుంటే రోడ్ల మీద ధాన్యాన్ని ఎండబెట్టుకునే పరిస్థితి ఉండదని వివరించారు.ఈ విషయమై తాను సంబంధిత మంత్రితో మాట్లాడగా సానుకూలంగా స్పందించారని అన్నారు. అదేవిధంగా సాంకేతిక లోపాలతో రుణమాఫీ కానీ ప్రతి ఒక్క రైతుకు డిసెంబర్ చివరి నాటికి రుణమాఫీ చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.ఎలక్షన్స్ ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500/- బోనస్ ఇస్తున్నామని చెప్పారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైస్ మిల్లర్లు 5 నుండి 6 కిలోల వరి ధాన్యాన్ని తరుగు తీసి రైతులను మోసం చేశారని, ప్రశ్నించిన రైతుల మీద దాడులు చేసిన సందర్భాలను గుర్తు చేశారు. నేడు ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి తరుగు లేకుండా మద్దతు ధరతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, కొనుగోలు చేసిన రెండు మూడు రోజుల్లోనే రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. గతంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవులు ఎమ్మెల్యే బినామీలకో, అనుచరులకో, కాంట్రాక్టర్లకో నోట్ల కట్టలు ఇచ్చిన వాళ్లకు ఇచ్చేవారిని అన్నారు.కానీ నేడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జుక్కల్ నియోజకవర్గంలో ఒక నూతన సాంప్రదాయాన్ని తీసుకొచ్చామని
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షుల సమక్షంలో ఆశావాహులందరినీ ఇంటర్వ్యూ చేసి ఎక్కువ మార్కులు సాధించిన వారిని చైర్మన్ గా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. బిచ్కుంద, మద్నూర్ మార్కెట్ కమిటీలకు కూడా ఇదే పద్ధతిని అవలంభించామని చెప్పారు. విద్యావంతుడు అయిన చికోటి మనోజ్ కుమార్ సారథ్యంలో పిట్లం మార్కెట్ కమిటీ అభివృద్ధి చెంతుందని ఆశిస్తూ,రైతుల పక్షపాతిగా ఏఎంసి ను కార్పొరేట్ సంస్థ లాగా అభివృద్ధి చేయాలని మనోజ్ ను సూచించారు..
నిజాంసాగర్ దగ్గర 12 ఎకరాలలో ఎకో టూరిజం పార్క్ ను ఏర్పాటు చేయబోతున్నామని
అదేవిధంగా కౌలాస్ కోటను కూడా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నిన్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి లెండి ప్రాజెక్టు పరిస్థితి గురించి వివరించగా త్వరలోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారని తెలియజేశారు. అదేవిధంగా నాగమడును కూడా రీ డిజైన్ చేసి త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.
లెండి, నాగమడుగు ప్రాజెక్టులు పూర్తి అయితే నియోజకవర్గంలో దాదాపు 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు.
జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని అన్నారు.. బిచ్కుంద ITI కళాశాలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా అప్ గ్రేడ్ చేస్తున్నామని అదేవిధంగా బిచ్కుంద,పిట్లం, జుక్కల్, నిజాంసాగర్ మండల కేంద్రాల్లో సెంటర్ లైటింగ్ ప్రారంభం అయ్యిందని, మద్నూర్ లో కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలిపారు.
ఇలా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలతో మనం ముందుకు వెళ్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జుక్కల్ ను దేశంలోనే నెం. 1 గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దని,పార్టీకి విధేయులుగా పనిచేయాలని,పార్టీ కోసం కష్టపడే వారిని తప్పక గుర్తిస్తానని,ఏఎంసి కోసం ఆశించిన వారికి కూడా తగిన పదవులు ఇస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మండలాల అధ్యక్షులు మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు వకీల్ రాంరెడ్డి, ప్రజా ఫండరీ ,శ్రీనివాస్,లోక్య నాయక్,తదితరులు ఉన్నారు.

  • Related Posts

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంతోపాటు,సుల్తాన్ నగర్, అచ్చంపేట్,బ్రహ్మంపల్లి,వెల్గనూర్,మాగి,వడ్డేపల్లి,మల్లూర్, జక్కాపూర్,నర్సింగ్ రావు పల్లి, మంగ్లూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే తోట…

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేసుకుందాం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంతో పాటు ధూప్ సింగ్ తండా,గిర్ని తండా, గాలిపూర్,మాగ్దుంపూర్,కోమలంచ,తుంకిపల్లి,నర్వ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 3 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 3 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    • By RAHEEM
    • December 9, 2025
    • 6 views
    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు