కొత్త చట్టం భూ భారతితో రైతులకు మేలు.. జుక్కల్ ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కొత్త చట్టం భూ భారతితో రైతులకు మేలు జరుగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో భూ భారతి పై రెవెన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట మాట్లాడుతూ..గడిచిన కాలంలో భూమి కోసం పోరాటాలు జరిగాయని వివరించారు.భూముల వివరాలు కాగితాలపై ఒక లెక్క,ఫిజికల్ గా మరో లెక్క ఉండేవన్నారు.రైతుల సమస్యలు పరిష్కరించడానికి భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు.జియో ట్యాగింగ్ చేసి భూదార్ కార్డు జారీచేయడం జరుగుతుందని తెలిపారు.సాధాబైనామా దరఖాస్తులను పరిశీలించి విచారణ చేసి న్యాయం చేయడం జరుగుతుందని అన్నారు.ధరణీ వలన రైతుల ప్రాణాలు పోయాయని తెలిపారు.ఎవరి భూమి వారికే చెందడానికి భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు.కొత్త చట్టాన్ని ప్రతీ ఒక్కరు అవగాహన కల్పించుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.జుక్కల్ నియోజక వర్గంలో దళారుల ప్రమేయం ఉండకూడదని,అలా చేసిన పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ను కోరారు.ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరగకూడదని పేర్కొన్నారు.
ఆయా అవగాహన సదస్సులలో పలువురు రైతులు ప్రసంగించారు.అంతకుముందు చట్టం పై రూపొందించిన వివరాలను ఆయా తహసీల్దార్లు వివరించారు.ఈ కార్యక్రమంలోవ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,మండల ప్రత్యేక అధికారిని ప్రమీల,నిజాంసాగర్,మొహమ్మద్ నగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,రవీందర్ రెడ్డి,తహసీల్దార్ లు బిక్షపతి,సవాయి సింగ్,ఎంపిడిఓ గంగాధర్,అనిత,మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్,మహమ్మద్ నగర్ మండల వ్యవసాయ అధికాణి నవ్య,రైతులు నాయకులు తదితరులు ఉన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..