మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్) నవంబర్ 15, రైతులకు ఇబ్బంది పెడుతున్నట్టు మాకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఓ ఎస్ డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి, నర్వ,మహమ్మద్ నగర్,తుంకి పల్లి తదితర గ్రామాలల్లో శుక్రవారం హైదరాబాద్ నుండి వచ్చిన టాస్క్ ఫోర్స్ 03 అధికారులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు కొనుగోలు కేంద్రంలో పరిస్థితుల గురించి రైతులకు అడిగి వరి ధాన్యం రికార్డులు, ధాన్యం బస్తాలను పరిశీలించారు.రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక బస్సాకు 40,600 కొనుగోలు మాత్రమే చేయాలని సూచించారు. ఇక్కడ వరి ధాన్యాన్ని ఎండబెట్టి మ్యాచ్ 16, 17 వస్తేనే రైస్ మిల్ దగ్గరకు ధాన్యాన్ని తరలించాలని అన్నారు. వరి ధాన్యాన్ని తీసుకువెళ్లిన తర్వాత రైస్ మిల్ యజమాన్యం రైతులకు ఇబ్బంది పెడితే మాకు సమాచారం అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ తనిఖీలలో టాస్క్ ఫోర్స్ సిఐ లక్ష్మయ్య,ఎస్ఐ శ్రీనివాస్, ఇన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ ఖలీక్ , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *