వైసిపి నాయకులు పగటి డ్రామాలు ఆపండితిరుపతిని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీనే

రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్

మనన్యూస్,తిరుపతి:గత వైసిపి హాయంలో టిడిఆర్ బాండ్ల జారీలో జరిగిన తీరుపై నగరపాలక సంస్థ కమిషనర్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే భూ బాధితులు తమ సమస్యలతో అధికారులు ముందు ఏ కరువు పెడుతుంటే ఇందుకు కారణమైన వారు పగటిపూట డ్రామాలు వేసుకొని ప్రజల దృష్టిని మరచాలని చూడటం అత్యంత బాధాకరమని రాష్ట్ర యాదవ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ అన్నారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని, ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తిరుపతి నగరాన్ని ఎంతో దూర దృష్టితో ఆలోచించి అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని, గత వైసిపి హాయంలో ప్రజలకు రాష్ట్రవ్యాప్తంగా నరకాన్ని చూపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి శ్రీవారి నిధులను దోచుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తిరుపతికి పచ్చదనాన్ని అందిస్తున్న చెట్లను డబుల్ డెక్కర్ బస్సులు తీసుకువచ్చి నాశనం చేశారన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల నాణ్యత పై విచారణ జరుగుతుందన్నారు. వీధి నాటకాలతో ప్రజలు హర్షించరని, తమ పాలనలో లోటుపాట్లు ఉంటే తమకు తెలపాలని సూచించారు. 320 కోట్ల తుడా నిధులు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బలహీనవర్గాలకు సబ్సిడీ రుణాలు అందిస్తున్నామని, అబద్ధాలు చెప్పి నాటకాలు చేస్తున్నవారికి ఇప్పటికే ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ మాట్లాడుతూ శ్రీవారి దర్శనాలపై భూమన కరుణాకర్ రెడ్డి చర్చకు రావాలన్నారు. కొంతమంది కార్పొరేటర్లు వందల కోట్లకు ఎలా పడగలెత్తారో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, రాయలసీమ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, జగన్నాథం, కట్టా జయరాం యాదవ్, హేమంత్ యాదవ్, సుబ్బు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?