వైసిపి నాయకులు పగటి డ్రామాలు ఆపండితిరుపతిని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీనే

రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్

మనన్యూస్,తిరుపతి:గత వైసిపి హాయంలో టిడిఆర్ బాండ్ల జారీలో జరిగిన తీరుపై నగరపాలక సంస్థ కమిషనర్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే భూ బాధితులు తమ సమస్యలతో అధికారులు ముందు ఏ కరువు పెడుతుంటే ఇందుకు కారణమైన వారు పగటిపూట డ్రామాలు వేసుకొని ప్రజల దృష్టిని మరచాలని చూడటం అత్యంత బాధాకరమని రాష్ట్ర యాదవ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ అన్నారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని, ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తిరుపతి నగరాన్ని ఎంతో దూర దృష్టితో ఆలోచించి అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని, గత వైసిపి హాయంలో ప్రజలకు రాష్ట్రవ్యాప్తంగా నరకాన్ని చూపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి శ్రీవారి నిధులను దోచుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తిరుపతికి పచ్చదనాన్ని అందిస్తున్న చెట్లను డబుల్ డెక్కర్ బస్సులు తీసుకువచ్చి నాశనం చేశారన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల నాణ్యత పై విచారణ జరుగుతుందన్నారు. వీధి నాటకాలతో ప్రజలు హర్షించరని, తమ పాలనలో లోటుపాట్లు ఉంటే తమకు తెలపాలని సూచించారు. 320 కోట్ల తుడా నిధులు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బలహీనవర్గాలకు సబ్సిడీ రుణాలు అందిస్తున్నామని, అబద్ధాలు చెప్పి నాటకాలు చేస్తున్నవారికి ఇప్పటికే ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ మాట్లాడుతూ శ్రీవారి దర్శనాలపై భూమన కరుణాకర్ రెడ్డి చర్చకు రావాలన్నారు. కొంతమంది కార్పొరేటర్లు వందల కోట్లకు ఎలా పడగలెత్తారో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, రాయలసీమ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, జగన్నాథం, కట్టా జయరాం యాదవ్, హేమంత్ యాదవ్, సుబ్బు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి